కార్పొరేషన్, జనవరి 2: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉన్నదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు అన్నారు. ఈ నెల 4న హైదరాబాద్లో జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశానికి సంబంధించి మంగళవారం కరీంనగర్లోని ఎమ్మెల్యే కమలాకర్ క్యాంపు కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. 4న జరిగే సమావేశానికి 70 మంది హాజరుకావాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పొన్నం అనిల్కుమార్, ఎంపీపీ లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, నాయకులు జమీలొద్దీన్, శ్యాంసుందర్, పిల్లి మహేశ్, సంపత్, రాజేందర్ పాల్గొన్నారు.