సైదాపూర్, డిసెంబర్ 23 : ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో చేపలను ఎండబెట్టేందుకు నిర్మించిన కల్లాలకు నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు నిర్మించిన కల్లాలకు నిధులను ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటివరకు చెల్లించిన రూ.151 కోట్ల నిధులను తిరిగి చెల్లించాలని సర్క్యులర్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
ఇప్పటివరకు కల్లాలు నిర్మించుకున్న రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చందా శ్రీనివాస్, భారత రాష్ట్ర సమితి మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, సింగిల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ రావుల రవీందర్ రెడ్డి, జిల్లా సభ్యులు చెలిమల్ల రాజేశ్వర్ రెడ్డి, సర్పంచుల ఫోరం కార్యదర్శి కాయిత రాములు, ఎంపీటీసీలు తొంట ఓదెలు, ఇందిరా సుధీర్, అనిత రవీందర్ రెడ్డి, రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్లు వీ మహిపాల్ రెడ్డి, ఎలకపల్లి రవీందర్, రవితేజ, సింగిల్ విండో ఉపాధ్యక్షులు, డైరెక్టర్లు జీ శ్రీనివాస్, బీ రాజు, ఎం సంపత్, బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్, బొడిగ కొమురయ్య, కిటకిట రాజు, సుధాకర్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ నుంచి..
హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 23 : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం చేపట్టిన మహాధర్నాకు సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడూరి ప్రతాపర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు స్వచ్ఛందంగా తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు.
ఇల్లందకుంట నుంచి..
ఇల్లందకుంట, డిసెంబర్ 23 : కరీంనగర్లో నిర్వహించిన రైతు ధర్నాకు మండలంలోని ప్రజాప్రతినిధులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివెళ్లారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి, సర్పంచులు కలాల రాజిరెడ్డి, కంది దిలీప్రెడ్డి, పుట్ట రాజు, మట్ట రజితావాసుదేవారెడ్డి, మొగిళి, మానస మహేందర్, అరుణాసదానందం, రాం మల్లయ్య, వనమాలవాసు, సరోజననాగయ్య, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, ఓదెలు, బీఆర్ఎస్ నాయకులు కనుమల్ల గణపతి, విక్రమ్, రవీందర్, రాంస్వరణ్రెడ్డి, శ్రీరాం, రైతులు రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, రాంరెడ్డి తదితరులున్నారు.
జమ్మికుంట మండలం నుంచి..
జమ్మికుంట రూరల్, డిసెంబర్ 23 : కరీంనగర్లో నిర్వహంచిన రైతు మహా ధర్నాకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధు లు, నాయకులు, రైతులు తరలివెళ్లారు. ‘జై కేసీఆర్.. జైజై బీఆర్ఎస్’ నినాదాలు చేశారు. ఇక్క డ సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్బీఎస్ కమిటీ సభ్యులు, నాయకులు, రైతులున్నారు.