ధర్మారం,డిసెంబర్14: కొన్నిసార్లు అటుపోట్లు సహజమని..అన్నింటిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం ధర్మారం మండలంలోని బీఆర్ఎస్ ఎంపీటీసీలు, ప్యాక్స్ చైర్మన్లు, పలువురు నాయకులు హైదరాబాద్లోని కొప్పుల నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై వారితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు పడ్డా రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి నడిచానని చెప్పారు.
ప్రజల మద్దతుతో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్గా, రాష్ట్ర మంత్రి హోదాలో పని చేసిన సమయంలో తాము పార్టీ పరంగా ఎన్నో పదవులు చేపట్టానని గుర్తు చేశారు. కష్టకాలంలోనూ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. కాగా ఆయన్ను కలిసిన నాయకులు ధైర్యంగా మీ వెంటే నడుస్తామని ముక్త కంఠంతో తేల్చిచెప్పారు. తనను కలిసిన వారందరికి ఈశ్వర్ అభినందనలు తెలిపారు. మండలంలోని పార్టీ మండల, గ్రామాల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు ధైర్యంగా నిలబడి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలను సైతం ఆత్మైస్థెర్యంతో ఎదుర్కొవాలని విజ్ఞప్తిచేశారు.
గతంలో మాదిరిగానే తాను అండగా నిలుస్తానని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈశ్వర్ను కలిసిన వారిలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఎంపీటీసీలు తుమ్మల రాంబాబు, గాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,
సూరమల్ల శ్రీనివాస్, దాడి సదయ్య, మోతె సుజాత కనకయ్య, భూక్యా సరితా శ్రీనివాస్, బెల్లాల రోజారాణి. లక్ష్మణ ప్రసాద్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్టినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు ఎగ్గెల స్వామి, పత్తిపాక ఉప సర్పంచ్ బండారి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, ఎన్ఆర్ఐ ద్యాగేటి ఉదయ్ యాదవ్, నాయకులు బద్దం రవీందర్రెడ్డి, యాళ్ల జగదీష్రెడ్డి, మెన్నేని వెంకటేశ్వర్రావు, ఆవుల వేణు, పెరుమాండ్ల ప్రసాద్, కోయెడ రవీందర్ ఉన్నారు.