పెద్దపల్లి, ఏప్రిల్ 26: ‘అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మో సపూరిత మాటలు నమ్మి నష్టపోయింది చాలు. కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో నాలుగు నెలల్లోనే తెలిసిపోయింది. ఈ ఎంపీ ఎన్నికల్లో నూ ఏవేవో చెబుతున్నరు. నమ్మితే గోసపడుతం. జాగ్రత్త’ అంటూ ప్ర జలకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యతిరేకి సీఎం కావడం దురదృష్టకరమని, నాలుగు నెలల్లో ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. పెద్దపల్లిలోని శాంతినగర్ పె ట్రోల్ బంక్, కునారం ఎక్స్రోడ్, సుభాష్నగర్, జెండా చౌరస్తా, అమర్ నగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి కొప్పుల పాల్గొ ని, మాట్లాడారు.
తనకు ప్రజా సేవే లక్ష్యమని, సమస్యల పరిష్కారంలో ముందున్నానని, అందుకే ప్రజలు ఆశీర్వదించి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలించారని గుర్తుచేశారు. బంగారు పల్లెంలో అన్నంతినే కాంగ్రెస్ అభ్యర్థికి ప్రజలు, కార్మికులు, కర్షకుల కష్టసుఖాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. నిజంగా పెద్దపల్లి ప్ర జల సంక్షేమం, అభివృద్ధి కోరుకునే కుటుంబమైతే ఇక్కడ పరిశ్రమలు, కంపెనీలు ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని, రైతు బీమా రెన్యూవల్ చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకావాలంటే ప్ర జల తరపున ప్రశ్నించే గొంతుక అ యిన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్కు పంపాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్రెడ్డి మాట్లాడుతూ, వరి బోనస్పై కాంగ్రెస్ బో గస్ మాటలు మాట్లాడుతున్నదని మండిపడ్డారు. క్వింటాల్కు 500 ఇస్తామని చెప్పి ఎందుకివ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులు, కర్షకులు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్దపల్లి జిల్లాగా మారిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని కొనియాడారు.
పదేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని, ఇప్పడున్న ఎమ్మెల్యేనే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడని, మరి అప్పు డు ఎందుకు పెద్దపల్లి పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పూదరి చంద్రశేఖర్, వునుకొండ సుజాత, సునీల్, లైశెట్టి భిక్షపతి, ఫహీం, పెంచాల శ్రీధర్, పెద్ది వెంకటేశ్, గండు రంగయ్య, వాసు, రవీందర్, బొడ్డుపల్లి రమేశ్ పాల్గొన్నారు.