రామడుగు, అక్టోబర్ 30: తనను ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటే, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ ప్రాంతం బిడ్డగా ఐదేండ్లల్లో నియోజకవర్గాన్ని ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశానని, కారుగుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కోరారు. రామడుగు మండలం దత్తోజిపేట, రంగశాయిపల్లి, రుద్రారంతోపాటు అనుబంధ గ్రామం కొత్తపల్లె(గౌండ్లపల్లి)లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. తొమ్మిదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండేనో మీ అందరికీ తెలుసన్నారు.
తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ఆడబిడ్డలు బిందెలతో రోడ్డెక్కి చేసిన ఆందోళనలు ఇంకా గుర్తున్నాయన్నారు. సాగు చేసేందుకు భూములున్నా.. నీళ్లు లేక పంట ఎడిపోతే రైతన్న గుండెపగిలి ప్రాణాలు తీసుకున్న వార్తలు ఇంకా మరిచిపోలేదన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా.. ప్రతి ఏడూ వేల క్యూసెక్కుల నీళ్లు మన ప్రాంతం నుంచి వెళ్లి సముద్రంలో కలుస్తున్నా.. నాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. నాడు చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలు కరువుతో అల్లాడేవన్నారు. అలాంటిది రా ష్ట్రం ఏర్పాటు తర్వాత కాళేశ్వరం జలాలతో భూములను తడిపి వ్యవసాయ రంగానికే వన్నె తెచ్చిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. నేడు నిత్యం నీటితో కళకళలాడుతూ ఎటుచూసి నా పచ్చని పంటపొలాలే దర్శనమిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
నియోజకవర్గాన్ని కోనసీమలా తీర్చిదిద్దేందుకు వరదకాలువకు నాలుగు ఓటీల నిర్మాణం చేపట్టామని, దీంతో ప్రతి ఎకరా కు నీటిని మలుపుకొని సాగుచేసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే నేడు అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. దేశాన్ని 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ క ర్ణాటకలో ఐదు గ్యారెంటీలతో గద్దెనెక్కి, అభివృద్ధి చేయలేక చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. అక్కడ 5 గంటలు కూడా ఇవ్వలేమని స్వయంగా ఆ రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రే చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలతో మోసపోయి గోసపడొద్దని విజ్ఞప్తి చేశారు. మరోసా రి కేసీఆర్ను సీఎంగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రచారంలో సర్పంచులు బండ అజయ్రెడ్డి, సాదు పద్మమునీందర్రెడ్డి, వొంటెల అమరేందర్రెడ్డి, ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్, ఎంపీటీసీలు కనకం జయ కనకయ్య, గుర్రం దేవికారాజశేఖర్గౌడ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్రెడ్డి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మా మిడి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్రెడ్డి, డైరెక్టర్లు కొడిమ్యాల రాజేశం, బత్తిని తిరుపతిగౌడ్, చెన్నూరి శ్రీకాంత్రెడ్డి, గడ్డం మోహన్రావు, కట్ట బ్రహ్మచారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు గంట్ల జితేందర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గం ట్ల వెంకటరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు జవ్వా జి శేఖర్, వంచ మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తౌటు మురళి, చాడ శేఖర్రెడ్డి, పెంటి శంక ర్, గునుకొండ అశోక్, సైండ్ల కరుణాకర్, చిరుత రాంచంద్రం, జగన్, పెగుడ శ్రీనివాస్ పాల్గొన్నారు.