జగిత్యాల : పట్టణంలోని కృష్ణానగర్కు చెందిన సాందరికారి ఉమ సురేష్ దంపతుల కుమార్తే సాందరికారి లహరి ( Lahari ) ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ర్యాంక్( Inter Rank ) ను సాధించింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో 1000 మార్కులకు గాను 995 మార్కులు సాధించి రాష్ట్రంలో తృతీయ ర్యాంకు, జగిత్యాల జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha – , తదితరులు విద్యార్థిని ఇంటికి వెళ్లి అభినందించారు. విద్యా ఒక్కటే జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందని అన్నారు. విద్యార్థిని లహరి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అయిల్నేని వెంకటేశ్వర్ రావు, జగిత్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక, ప్రవీణ్ కుమార్, కేసీఆర్ సైన్యం జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాగుల రాజు, నాయకులు గొడిసెల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.