కార్పొరేషన్, ఫిబ్రవరి 2: బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డమైన విమర్శలు చేయడం మాని దమ్ముంటే రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తేవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సవాల్ చేశారు. సీఎంపై విమర్శలు చేసే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి ఏం సాధించారో చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తారక హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. కర్ణాటకకు కరువు సహాయం కింద 1500కోట్లు ఇస్తే రాష్ట్రం ఎందుకు అడగలేదని సిగ్గులేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. మేము అడగకపోతే మరి మీరేం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభు త్వం మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని అడిగితే ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
ఇక్కడి సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వని కేంద్రం కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులకు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇంకా సిగ్గు లేకుండా బండి సంజయ్, ఈటల రాజేందర్ బడ్జెట్ గొప్పద ని చెప్పడం దురదృష్టకరమన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకున్నా కేటీఆర్ హయాంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కార్పొరేట్ సంస్థలు తమ పెట్టుబడులను హైదరాబాద్లో పెడుతున్నాయన్నారు. బీసీలు, బడుగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 38 వేల కోట్ల బడ్జెట్ పెడి తే దానిలో సగం నిధులు మాత్రమే దేశవ్యాప్తంగా బీసీల కోసం కేంద్ర బడ్జెట్లో నిధులు పెట్టిందని గుర్తుచేశారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి నిధులు కోతలు పెట్టడంతోనే బీజేపీ తీరేంటో అర్థమవుతుందన్నారు.
మైనార్టీ సంక్షేమానికి నిధులు ఎందుకు కోతలు పెట్టారో చెప్పాలన్నారు. కేంద్రం మంజూరు చేసిన 158 నర్సింగ్ కళాశాలల్లో రాష్ర్టానికి ఒక్కటి కూడా ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలన్నారు. గెలిచినప్పటి నుంచి హుజురాబాద్ నియోజకవర్గానికి ఏం చేయలేక ప్రజలకు జవాబు చెప్పే ధైర్యం లేకే ఈటల రాజేందర్ హుజురాబాద్కు రావడం లేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ చెప్పిన హామీ లు ఏమైయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ రాణిరుద్రమ ఇష్టం వచ్చినట్లు కేటీఆర్ కుటుంబ సభ్యుల గురించి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కేటీఆర్ను విమర్శించే అర్హత కూడా రాణిరుద్రమకు లేదన్నారు. బీజేపీలోని 47మంది ఎంపీ, ఎమ్మెల్యేలపైనే అత్యచార కేసులు ఉన్నాయని, అలాంటిది బీ జేపీ నాయకురాలు రాణిరుద్రమ మహిళల గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చీటీ రాజేందర్రావు, శ్రీనివాస్గౌడ్, ఉదారపు మారుతి,ప్రశాంత్,ఆరె రవిగౌడ్,రాధ పాల్గొన్నారు.