తిమ్మాపూర్/హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 15 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఆదివారం హైదరాబాద్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్స్ అందుకున్నారు. సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్తోపాటు మానకొండూర్, పెద్దపల్లి, హుజూరాబాద్ అభ్యర్థులు రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి బీ ఫామ్స్ తీసుకున్నారు.
హుస్నాబాద్ అభ్యర్థి వొడితల సతీశ్కుమార్కు అక్కడ జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి బీ ఫామ్ అందించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.