జ్యోతినగర్, జూన్ 25: సమైక్య పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, వారి పాలనలో అంధకారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వెలుగుల్లోకి వచ్చిందని, అభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు.
ఆదివారం రామగుండం పట్టణంలోని ఏఎస్ ఫంక్షన్ హల్లో జరిగిన బీఆర్ఎస్ పట్టణ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా వచ్చి, మాట్లాడారు. 70 ఏండ్ల పాలనలో పాలనలో కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిందని, ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రామగుండంలోని బీపీఎల్ పవర్ ప్లాంటు ప్రాజెక్టును కూలదోసి ప్రజలను రోడ్డుమీద పడేసిన ఘన చరిత్ర ఆ పార్టీదని మండిపడ్డారు. నాడు శాప్ చైర్మన్గా కొనసాగిన మక్కాన్సింగ్ ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధనకు నడుంబిగించి తెలంగాణ సాధించారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.75వేలు ఇస్తే నేడు కేసీఆర్ గృహలక్ష్మీ పథకం కింద రూ.3లక్షల అందిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రామగుండాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఇక్కడి ప్రజల ఆశీస్సులతోనే ఈ ప్రాంత అభివృద్ధికి తాను అహర్నిశలూ కృషిచేస్తున్నానని, ప్రజావసరాలు తీరుస్తున్నానన్నారు. నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం మెడికల్ కాలేజీని తెచ్చానని, అలాగే స్థానిక యువతకు ఉపాధి కోసం ఐటీ పార్కు, ఇండస్ట్రీయల్ పార్కులును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గత పాలకులు దశాబ్దాలపాటు చేయని పనులను తాను కేవలం నాలుగున్నరేండ్లలోనే చేసి చూపించినట్లు తెలిపారు.
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి ఓటువేసి రుణం తీర్చుకోవాలని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు కన్నూరి సతీశ్కుమార్, అమ్రిన్ ఫాతిమా సేలీంబేగం, దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, దాతు శ్రీనివాస్, జనగామ కవిత సరోజని, కల్వచర్ల క్రిష్ణవేణి, నాయకులు దీటు బాలరాజ్, తోడేటి శంకర్గౌడ్, పర్లపల్లి రవి, జేవి రాజు, దాదాసు రామ్మూర్తి, మెతుకు దేవరాజ్, అడ్డాల రామస్వామి, కల్వల సంజీవ్, కాల్వ శ్రీనివాస్, వేగోలపు శ్రీనివాస్, శివరాత్రి గంగాధర్, కలవల శ్రీను, ఇరుగురాల శ్రావణ్, అల్లి గణేశ్, గోవర్దన్, అబ్బాస్, తిరుపతి నాయక్, వేణు, అంజి, ఆనంద్, కనకపాల్, మహేందర్ వడ్డెపల్లి రమేశ్, నిమ్మని సంతోశ్, పల్లికొండ నరేశ్, దాముఖ వంశీ, అశాది వేణుగోపాల్, డాక్టర్ ముస్తఫా, దుర్గం రాజు, పెరిక శంకర్ ఉన్నారు.