కార్పొరేషన్, మే 2: కరీంనగర్లో అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో గురువారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, ఎంపీ బండి సంజయ్ ఎప్పుడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు అనేక మార్లు కరీంనగర్ అభివృద్ధితో పాటు రాష్ట్రం కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినట్లు గుర్తు చేశారు.
ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, నగరంలోని మల్టీపర్సస్ స్కూల్ మైదానాన్ని సుందరమైన పార్కుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కేసీఆర్ హయాంలో నగరం ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వినోద్కుమార్ను ఎంపీగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, కార్పొరేటర్లు వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మహేశ్, మురళి, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్/మానకొండూర్ రూరల్, మే 2: ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు గుడి తేలేదు, బడి తేలేదని.. ఆయనకు ఎందుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రశ్నించారు.? మత రాజకీయాలతో పబ్బం గడుపుతూ, దేవుడి పేరుతో ఓట్ల బిచ్చం అడుక్కోవడం తప్పా ఆయనకు ఏమీ తెలియదంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మానకొండూర్ మండలం లలితాపూర్, పచ్చనూర్, తిమ్మాపూర్ మండలం పొరండ్ల, మన్నెంపల్లి గ్రామాల్లో గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని.. అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి వైఫల్యం చెందారని, ప్రజలు ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలంగాణ తరఫున ప్రశ్నించే గొంతుకనవుతానని, ప్రజలు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడైనా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తానని చెప్పారు. మానకొండూర్లో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, స్థానిక నాయకులు, తిమ్మాపూర్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఏకానందం, పొన్నం అనిల్ గౌడ్, స్వామి రెడ్డి, తిరుపతి రెడ్డి, ఎలుక ఆంజనేయులు, జాప శ్రీనివాస్రెడ్డి, కనకయ్య, నాయకులు పాల్గొన్నారు.