హుస్నాబాద్, అక్టోబర్ 15: వరుసుగా మూడు ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి శ్రీకారం చుట్టడం ఇక్కడి ప్రజలకు గొప్ప గౌరవంగా భావించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యాలయంలో అభ్యర్థులకు బీఫామ్లు అందజేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన సీఎం కేసీఆర్ నేరుగా హుస్నాబాద్కు వచ్చారంటే ఇక్కడి ప్రజలపై ఆయనకు ఉన్న నమ్మకం, గౌరవానికి నిదర్శనమన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే, అనుకున్న సమయంలో గౌరవెల్లి రిజర్వాయర్ నీళ్లు పొలాలకు రావాలంటే మూడోసారి వొడితెల సతీశ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించాలన్నారు. సమావేశంలో కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పాతూ రి సుధాకర్రెడ్డి, జడ్పీ చైర్మన్లు వేలేటి రోజాశర్మ, డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, పేర్యాల రవీందర్రావు, భూపతిరెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వైస్ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోత్ లక్ష్మి, కొక్కుల కీర్తి, కొత్త వినీత, ప్రభాకర్రెడ్డి, అనిత, జడ్పీటీసీలు భూక్యా మంగ, నాగరాజు శ్యామల, గీకురు రవీందర్, వంగ రవీందర్, గోపాల్రావు, మార్కెట్ చైర్పర్సన్ ఎడబోయిన రజనీతిరుపతిరెడ్డి, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.