జమ్మికుంట, సెప్టెంబర్ 9: ‘ఉపాధ్యాయులు నవ సమాజ నిర్మాతలు..భావి తరానికి మార్గనిర్దేశకు లు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే గురువుల స్థానం వెలకట్టలేనిదని అభివర్ణించారు. అయితే శ క్తినంతా ధారపోసి విద్యనందిస్తున్న ప్రైవేట్ టీచర్ల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కేంద్రానికి కనువిప్పుకలిగేలా లక్ష మందితో త్వరలో హైదరాబాద్లో నిర్వహిస్తామని తెలిపారు. ట్రస్మా హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు ము సిపట్ల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో గురుపూజోత్స వం సందర్భంగా నియోజకవర్గస్థాయి ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు, టీచర్లను శనివారం జ మ్మికుంటలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినోద్కుమార్, మం డలి విప్ పాడి కౌశిక్రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రైవేట్ టీచర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
కరోనా సమయంలో వారిని అన్ని విధాలా ఆదుకున్నామని, భవిష్యత్లోనూ అండగా ఉంటామని స్పష్టం చేశా రు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిన విషయాలను వివరించారు. ఇప్పుడు కూడా ప్రత్యేక చట్టం కోసం నివేదిక తయారు చేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు,తర్వాత జరిగిన పరిణామాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. తెలంగాణ వస్తే చీకటిగా మారుతుందని నాటి నాయకులు అ న్నారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7778 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉండేదని, నేడు 25వేల మెగావాట్ల విద్యుత్తో 24గంటల కరెంటును అందిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో క రెంట్ ఉండటం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రా జేందర్ అనడం హాస్పాస్పదమని, కరెంటెక్కడ లేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. రాత్రిపూట బావులకాడికి రైతులు వెళ్లుతున్నారా..? చెప్పాలన్నారు. చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఎత్తిపోతల పథకాలతో తెలంగాణ సస్యశ్యామలమైందని, అదనంగా కోటి ఎకరాలకు నీరందుతున్నదని చెప్పారు. తెలంగాణ దేశానికి మోడల్గా నిలిచిందన్నారు.
‘ఈటలకు ఏడుసార్లు అవకాశం ఇచ్చిన్రు. ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి. మీ బిడ్డగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. సుందరంగా తీర్చిదిద్దుతా.’ అని మండలి విప్, బీఆర్ఎస్ హు జూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి హామీ అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గ తంలో చేసిన పోరబాట్లు సరిదిద్దుకుందామని, హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని తీర్చిదిద్దేది ఉ పాధ్యాయులని, సంక్షేమం, అభివృద్ధిని ఉద్యమం లా చేస్తున్న బీఆర్ఎస్పై చర్చించాలని విజ్ఞప్తి చేశా రు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వా త ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంతో చర్చిస్తానని స్పష్టం చేశారు. బీమా, హెల్త్కార్డులతో పాటూ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చెప్పారు. నియోజకవర్గాన్ని ఈటల పట్టించుకోలేదని, రాబోయే 5సంవత్సరాల్లోపు ఔటర్ రింగ్రోడ్లు, కేబుల్ బ్రిడ్జి, మినీ స్టేడియాలు, కనివిని ఎ రుగని తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇల్లందకుంట శ్రీసీతారామ చంద్రస్వామిఆలయా న్ని యాదాద్రిలా తీర్చిదిద్దుతానని తెలిపారు. వా విలాల, చల్లూర్, శనిగరం గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. వినోద్కుమార్తోనే కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారిందని, ఎంపీగా వినోద్ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలనికోరారు. కేసీఆర్ మండలి విప్గా అవకాశం ఇచ్చారని, ఇంతకంటే పెద్ద పద వి నాకు ఏ దీ కాదన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే అద్భుతమైన అ భివృద్ధి చేసి, మీ గుండెల్లో నిలిచిపోతా..అని అన్నారు.
పనిచేసే ప్రభుత్వం వెంటన నడుద్దామని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు తెచ్చింది వినోద్కుమార్ అని, ఆ యనకు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సంరక్షణ చట్టం కోసం ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. రాష్ట్ర సర్కారు ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు అందించిన వెసులుబాటును వివరించారు. ఉపాధ్యాయులకు సమాజం రుణపడి ఉంటుందని జడ్పీ చైర్పర్సన్ విజయ పేర్కొన్నారు. తర్వాత కరస్పాండెంట్లను, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమా ల్లో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.