రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 40,199 మందికి డబ్బులు ఉపాధి హామీ కింద ఇచ్చాం. రోడ్లపై వడ్లు ఆరబెట్టితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం కోర్టు ఆదేశం ఇచ్చింది. అలాంటప్పుడు రైతులు ధాన్యాన్ని ఎకడ ఆరబోసుకోవాలో కేంద్రమే చెప్పాలి. వీటన్నింటినీ ముందస్తుగానే ఆలోచించి రైతుల కోసం కమ్యూనిటీ స్టోరేజ్ కింద సీఎం కేసీఆర్ కల్లాలను నిర్మించారు.
కేంద్రం చేయాల్సిన పనులను రాష్ట్రమే చేస్తుంటే అభినందించాల్సింది పోయి అకసు వెల్లగక్కుతున్నది. ఉపాధిహామీ పథకం ద్వారా రావాల్సిన రూ.150 కోట్లు రికవరీ చేయడం కరెక్ట్ కాదు. కేంద్రం కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది.
– విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
హుజురాబాద్ టౌన్, డిసెంబర్ 23: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ.150కోట్లు రికవరీ చేయడం కరెక్ట్ కాదని, కేంద్ర ప్రభుత్వం కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు వీలుగా కమ్యూనిటీస్ స్టోరేజ్ కింద కల్లాలను ఏర్పాటు చేశామన్నారు. 40,199 మందికి డబ్బులు ఉ పాధి హామీ కింద ఇచ్చామన్నారు. రోడ్లపై వడ్లు ఆరబెడితే అరెస్ట్లు, ఫైన్లు వేయాలని సుప్రీం కోర్టు ఆదేశం ఇచ్చిందని, అలాంటప్పుడు రైతులు ధాన్యాన్ని ఎకడ ఆరబోసుకోవాలో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీటన్నింటినీ ముందస్తుగానే ఆలోచించి రైతుల కోసం క మ్యూనిటీ స్టోరేజ్ కింద కల్లాలను కూడా నిర్మించారన్నా రు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను రాష్ట్ర ప్రభు త్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి అకసు చూపుతున్నదన్నారు. దేశంలో చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధిలో ఉందన్నారు. ఇప్పటికీ కొ న్ని రాష్ట్రాల్లో కరెంటు లేని ప్రాంతాలు, కనీసం మట్టి రోడ్డు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ పథకం నిధులు రూ. 150 కోట్లను జీఎస్టీలో రికవరీ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుందన్నారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ సుఖంగా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివా స్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్, జమ్మికుంట చైర్మన్ తకెళ్లపల్లి రాజేశ్వరరావు, జడ్పీటీసీ శ్రీరా మ్ శ్యాం, వైస్ చైర్మన్ నిర్మల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరు విజయ్ కుమార్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, రమాదేవి, సుశీల, నేతలు గొడిశాల పావని గౌడ్, శ్రీనివాస్ యాద వ్, యాదగిరి కొండ్ర నరేశ్, బాబురావు, కుమారస్వామి, సారయ్య, భిక్షపతి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.