రాంనగర్ మే 29: బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి స్తంభాన్ని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడి ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి భానుప్రకాశ్రెడ్డి(20) మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో తన మిత్రులైన రిత్విన్ (19), ఆదిత్య, సిద్ధార్థను కలిసేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా భానుప్రకాశ్రెడ్డి, రిత్విన్ ఒక బైక్పై.. ఆదిత్య, సిద్ధార్థ మరో బైక్పై బయటికి వెళ్తున్నారు. భాగ్యనగర్ సమీపానికి చేరుకునేసరికి కుక అడ్డు రావడంతో భానుప్రకాశ్రెడ్డి, రిత్విన్ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో భానుప్రకాశ్రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అకడికకడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన రిత్విన్ను చికిత్స కోసం దవాఖానకు తరలించగా, బుధవారం ఉదయం పరిస్థితి విషమించి మృతిచెందాడు. భానుప్రకాశ్రెడ్డి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.