కార్పొరేషన్, నవంబర్ 26: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను పర్యాటక నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. అంతర్జాతీయస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరలోగా కేబుల్ బ్రిడ్జి, వచ్చే సంవత్సరాంతానికి మానేరు రివర్ ఫ్రంట్ను అందుబాటులోకి తీసుకువస్తామ ని చెప్పారు. శనివారం కరీంనగర్లో చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై కలెక్టరేట్లో అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సకల హంగులతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్కు తలమానికంగా నిలుస్తాయని చెప్పారు. కరీంనగర్ను ప్రపంచ దేశాలకు దీటుగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇప్పటికే 1.5 కిలోమీటరు మేర భూసేకరణ పూర్తయిందన్నారు. అవసరమైతే అదనంగా సేకరించేందుకు సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు. 1.1 కిలోమీటర్ నుంచి 3.7 కిలో మీటర్ మేర మానేరు రివర్ ఫ్రంట్కు ఇరువైపుల ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా ఇరువైపులా ఆకర్షణీయంగా ఆధునిక హంగులతో పార్, 210 మీటర్లతో హెల్ఫ్ బ్యారేజ్, చెక్ డ్యామ్ అభివృద్ధి, మానేరు రివర్ ఫ్రంట్ డీబీఎం 1 ఫీడర్ కెనాల్ పనులను, లోయర్ పోమనేడ్, అప్పర్ పోమనేడ్ పనులు చేపడతా మని చెప్పా రు.
మానేరు రివర్ ఫ్రంట్ అందాన్ని మరింత ఇనుమడింపజేసేలా 60 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మానేరు ఎగువ నుంచి విడుదల చేసి నీటి ప్రవాహన్ని తట్టుకునేలా లేజర్ షో ఫౌంటెయిన్ నిర్మాణ పనులకు సంబంధించి పలు సంస్థలు ప్ర దర్శించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించా రు. కార్యక్రమంలో టూరిజం శాఖ ఎండీ మనోహర్రావు, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీలు మురళీధర్రావు, రవీందర్రావు, ఎస్సారెస్పీ సీఈ శంకర్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నగర మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్కుమార్, నేతలు చల్ల హరిశంకర్, రాములు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం గొప్పది
ప్రపంచంలో భారత రాజ్యాంగం గొప్పదని, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వ పాలనతో భారత రాజ్యాంగ వ్యవస్థకు పెను ప్రమాదం వాటిల్లుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురసరించుకొని నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేదర్ విగ్రహానికి శనివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 25 రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలను కూల్చివేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. బీజేపీని ప్రజలు గద్దెదించకపోతే ఉత్తరాదిన పరిస్థితులు తెలంగాణలోనూ పునరావృతమవుతాయన్నారు. అందరూ కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, నాయకులు చల్ల హరిశంకర్, మేడి మహేశ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.