ఓదెల, డిసెంబర్ 15: రైతులు తమ పంటలను పక్షులు, అడవి జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు బెదురుగా అనేక వస్తువులను పెడుతుంటారు. కానీ ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని రైతు మాత్రం సరికొత్తగా ఆలోచించాడు.
అచ్చం మనిషిని పోలిఉన్న బొమ్మను తన మిర్చి తోట వద్ద ఏర్పాటు చేశాడు. తలకు హెల్మెట్ కూడా అమర్చాడు. అప్పటి నుంచి పక్షులు, అటవీ జంతువుల బాధ బెడద తప్పిందని సదరు రైతు చెబుతున్నాడు. కాగా రాత్రి పూట అటుగా వెళ్లే వారు ఆ బొమ్మను చూసి మనిషేనని భ్రమపడుతున్నారని అంటున్నాడు.