తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్31: తెలవారుతుండగానే గ్రామాల్లో పర్యటిస్తూ.. లబ్ధిదారులకు పైసలిస్తూ బిజీబిజీగా గడిపారు రాష్ట్ర సాంస్కృతిక సారథిచైర్మెన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్. మండలంలోని తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణికుంట, వచ్చునూర్, నేదునూర్, జూగుండ్ల గ్రామాల్లో ఆయన స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. పలు గ్రామాల్లో ఎమ్మెలే ్యకు నాయకులు, గ్రామస్తులు నుదుటన తిలకం దిద్దుతూ.. శాలువాలతో సత్కరిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. లబ్దిదారుల ఇంటింటికీ తిరుగుతూ కళ్యాణలక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రామకృష్ణకాలనీలో సర్పంచి మీసాల అంజయ్య ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ రామాంజనేయ గంగాభవానీ ఆలయానికి రూ.లక్ష విరాళం అందజేశారు.
రేణికుంటలో కుంచం కుమార్, కోమురవ్వలకు ఇటీవల ప్రమాదంలో గాయాలై ఇన్ఫెక్షన్ సోకి మంచానికే పరిమితమైన దంపతులకు భరోసా కల్పించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి సుపరింటెండెంట్కు తక్షణమే ఫోన్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్రెడ్డికి చెప్పారు. వచ్చునూర్లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేకు కోశారు. కార్యక్రమాల్లో పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, వైస్ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచులు దుండ్ర నీలమ్మ, మీసాల అంజయ్య, కాటిక వినోద, బోయిని కోమురయ్య, ఉమారాణి, వడ్లూరి శంకర్, సాయిళ్ల ఎల్లేష్, ఎంపీటీసీలు వేల్పుల మమత, కిన్నెర సుజాతసారయ్య, కొత్త తిరుపతిరెడ్డి, కనుకం కోమురయ్య ఉన్నారు.