హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్2 : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నం బర్వన్గా తీర్చిదిద్దారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం దేశవ్యాప్తంగా 20 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేస్తే, అందులో 19 గ్రామాలు మనవే ఉన్నాయని, ఇది స్వయంగా పార్లమెంటులో కేంద్ర మంత్రులు చెప్పారని గుర్తు చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి సీఎంగా కేసీఆరే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కౌశిక్రెడ్డి చాలా ఎన్నికల హామీలు ఇచ్చారని, ఇది కేసీఆర్ ఉన్నారన్న ధైర్యంతోనే ఇచ్చారని, కౌశిక్ను గెలిపిస్తే అవన్నీ పూర్తి చేస్తాడని, అందుకు తాను సహకరిస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో కౌశిక్రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. హుజూరాబాద్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డికి స్వాగతం పలుకుతూ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీ, సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు చచ్చేది కాదు అని ఆనాడు కాంగ్రెస్, బీజేపీ నాయకులు అన్నారని, కానీ కేసీఆర్ నాయకత్వం లో 39 పార్టీలు ఉంటే 28 పార్టీలను ఒప్పించి తెలంగాణ తెచ్చామని, ప్రస్తుతం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 70 శాతం ప్రజలు గ్రామాల్లో జీవిస్తున్నారని వ్యవసాయంపై ఆధారపడి ఎకువగా జీవిస్తున్నారని రైతులు ఆర్థికంగా ఎదిగితేనే పట్టణాలు, దేశం అభివృద్ధి చెం దుతాయని పేర్కొన్నారు. రైతుల పరిస్థితి నాడు ఏ విధంగా ఉండేది? నేడు ఏ విధంగా ఉన్నదో..? ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. రెండెకరాల పొలమున్న రైతు నేడు కోటీశ్వరుడిలా భా వించుకుంటున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల తనకు భిన్నమైన భావజాలం ఉన్న పార్టీలో కొనసాగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించేందుకు కాళేశ్వ రం ప్రాజెక్టు తెస్తే కేంద్రం ఒక పైసా కూడా ఇవ్వలేదని, అయినా సొంత రాష్ట్రం నిధులతో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిదులు కేంద్రం ఇవ్వలేదని మండిపడ్డారు.
బండి సంజ య్ కరీంనగర్కు చేసింది శూన్యమన్నారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసుకున్నామని, కేబుల్ బ్రిడ్జిని కూడా ఇటీవల తీసుకువచ్చామని వివరించారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని, రాబోయే ఐదేళ్లు పెద్దగా ఖర్చులు లేవని ఇప్పటికే ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల తదితర ముఖ్యమైన ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితే పట్టణం అభివృద్ధి చెందుతుందని, ఇక గ్రామీణ ప్రాంతాలను కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని, అందుకోసం మైక్రో ప్లానింగ్ చేస్తామని అన్నారు. బడు గు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తామని ఇంటింటికీ తిరుగుతామని తెలిపారు. గతంలో అతి తకువ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవని, కానీ ప్రస్తుతం వందల గురుకుల పాఠశాలలు రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఎంతో అద్భుతమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాకు కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని గతంలో రాష్ట్రంలో కేవలం 350 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని వాటిని పదివేలకు పెంచామని అన్నా రు. ఒకో మెడికల్ కాలేజీలో 120 మంది ప్రత్యే క వైద్యులు పనిచేస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పెండ్లిళ్లు, పేరంటాలు, కూడళ్లలో చర్చ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.