రాజన్న సిరిసిల్ల :వరికంటే ప్రత్యామ్నాయ పంటలతో భవిష్యత్ను బంగారు మయం చేసుకోవాలని నాబ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ఏర్పాటుచేసిన నా రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దొడ్డు రకం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని స్పష్టం చేసింది.
రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ ఫామ్ తోటల సాగులో లాభదాయకంగా ఉందని, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఆయిల్ తోటల సాగు, ప్రత్యామ్నాయ పంటల సాగులో జిల్లాను అగ్రగామిగా నిలపాలని ఆయన కోరారు.
సమావేశంలో ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్కుమార్, ఎంపీపీ వంగ కరుణ, వైస్ ఎంపీపీ దోస లత ఏఎంసీ చైర్ పర్సన్ సుటారి బాలవ్వ, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, ఏరువాక శాస్త్రవేత్త రాజశేఖర్, జెడ్పీ కొప్షన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.