జ్యోతినగర్, నవంబర్ 7: ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయ్టాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట్హౌస్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. అంతకు ముం దు కలెక్టర్ రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి, ఆదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్కుమార్, డీసీపీ రూ పేశ్ కుమార్తో కలిసి ప్రధాని సభ జరిగే ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహత్మాగాంధీ స్టేడి యం, హెలిప్యాడ్, ఆర్ఎఫ్సీఎల్ ప్లాంటును పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశా రు. ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ జాహీద్పాషా, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ ఉన్నారు.