ఇల్లంతకుంట/ సిరిసిల్ల క్రైం జూన్ 21: ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో బోల్తాపడ్డది. ఈ ఘటనలో 20 మంది గాయప డ్డారు. వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వీరిని పోలీసులు తమ పెట్రోకార్ వాహనంలో ద వాఖానకు తరలించారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని వల్లంపట్ల శివారులో బుధవారం ఉదయం పంట పొలాల మధ్య నుంచి టాక్టర్ వేగం గా రోడ్డుపైకి వస్తూ రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొన్నది.
ఈ క్రమంలో రోడ్డు పక్కన గల గుంతలో బస్సు బోల్తాపడింది. బస్సులో 41 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఎస్ఐ రాజేశ్ సిబ్బంది సహాయంతో సిరిసి ల్ల దవాఖానకు తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు గర్భిణులను పెట్రోకార్ వాహనంలో, మిగిలిన వారిని ఆంబులెన్స్లోదవాఖానకు తరలించారు. విషయం తెలుసుకు న్న జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గాయపడ్డవారిని పరామర్శించారు. అధైర్యపడవద్దని, మెరుగైన చికిత్స అందుతుందని భరో సా ఇచ్చారు. కాగా, బస్సు బోల్తాపడ్డ విషయం తెలుసుకొని ఎస్ఐ రాజేశ్ సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దవాఖానకు తరలించడంపై పలువురు ఆయనను అభినందించారు.