ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన కామని జయశ్రీ, నీట్లో సత్తాచాటి, ఉన్న ఊరు రామగుండం మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్నది. ఇలా జయశ్రీ ఒక్కరే కాదు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎందరో పేదింటి బిడ్డల వైద్యవిద్య స్వప్నం సాకారమైంది. సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్య చేరువ కాగా, పిల్లలు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ)
జయశ్రీ తన ఇంటి వద్ద ఉన్న శ్రీరామ సూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా చదివింది. టెన్త్ క్లాసులో 10/10 మారులు సాధించింది. ఇంటర్మీడియట్ను అంతర్గాం మండలం లింగాపూర్ ప్రభుత్వ మోడల్ సూల్లో పూర్తి చేసింది. ఇంటర్లో 985 మారులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. నీట్లోనూ చక్కని ప్రతిభను చాటి ఎంబీబీఎస్లో సీటు దక్కించుకున్నది.
సర్కారు లక్ష్యం నెరవేరుతున్నది. ప్రతిభ ఉన్న ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్యను చేరువచేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. మొన్నటిదాకా ఖర్చుతో కూడుకొని, అది కూడా రాష్ర్టాలు, దేశాలు దాటి వెళ్తే గానీ అందని ద్రాక్షగా ఎంబీబీఎస్ చదువు, ఇప్పుడు ఉన్న జిల్లాలోనే అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర సర్కారు ప్రారంభించిన జిల్లాకో మెడికల్ కాలేజీతో పేదల మెడిసిన్ కల సాకారమవుతున్నది. అందుకు గోదావరిఖనిలోని కాకతీయనగర్కు చెందిన కామని జయశ్రీ చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నది. తండ్రి ఫొటోగ్రాఫర్గా, తల్లి బ్యుటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆమె తన టాలెంట్తో రామగుండం మెడికల్ కళాశాలలో సీటు దక్కించుకున్నది. ఇటీవలే కాలేజీలో చేరగా, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– పెద్దపల్లి, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ)
గోదావరిఖనిలోని కాకతీయనగర్కు చెందిన కామని ప్రభాకర్-విజయలక్ష్మి దంపతులది పేద కుటుంబం. వీరికి ఇద్దరు కూతుర్లు. ప్రభాకర్ 30ఏళ్లుగా ఫొటో స్టూడియో, జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఫొటోస్టూడియో సరిగా నడవకపోవడంతో భార్య విజయలక్ష్మి సైతం టైలరింగ్, బ్యూటీ పార్లర్ నడుపుతూ చేదోడువాదోడుగా ఉంటున్నది. ఇద్దరు కూతుర్లు కూడా సాయం అందిస్తున్నారు. పెద్ద కూతురు కామని వైష్ణవి ఎంటెక్ చదువుతుండగా, చిన్న కూతురు జయశ్రీ రామగుండం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కైవసం చేసుకుంది.
చిన్నది చదువు మొదలు పెట్టినప్పటి నుంచీ డాక్టర్నవుతా అనేది. కానీ అది సాధ్యమా..? అని నేననుకునేదాన్ని. అది కష్టపడి చదివేది. కానీ ఎక్కడో సిటీల్లో చదివించే స్థోమత మాకు లేదని బాధపడే దాన్ని. కానీ గోదావరిఖనిలో మెడికల్ కళాశాల పెట్టినంక ఇక్కడ సీటు వస్తే మంచిగుండు అనుకునేదాన్ని. ఈ ఏడాది బిడ్డ నీట్ రాసింది. నీట్లో మంచి ప్రతిభను చాటింది. రామగుండం మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. సీఎం కేసీఆర్ వల్లే రామగుండానికి మెడికల్ కళాశాల వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఈ కాలేజీ ఇక్కడికి అచ్చేది కాదు. సీఎం కేసీఆర్ వల్లే మా బిడ్డ సిటీలకు వెళ్లి చదువుకునే దూర భారం తప్పింది. డబ్బు బాధ అసలే లేకుంటైంది. రామగుండంలో మెడికల్ కళాశాల పెట్టిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.
– కామని విజయలక్ష్మి జయశ్రీ తల్లి (గోదావరిఖని)
మాది చాలా పేద కుటుంబం. సొంత ఇళ్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఫొటో స్టూడియో, జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తూ జీవిస్తున్నా. ఈ మధ్య కాలంలో ఫొటో స్టూడియోకు ఆదరణ తగ్గింది. నా భార్య విజయలక్ష్మి ఇదే ఇంట్లో టైలరింగ్, బ్యూటీ పార్లర్ నడుపుతున్నది. చాలా కష్టంగా జీవనం గడుపుతున్నాం. నా పెద్ద కూతురు వైష్ణవి ఎంటెక్ చదువుతున్నది. చిన్న కూతురు జయశ్రీ టార్గెట్ పెద్దది. తాను ఎంబీబీఎస్ చేయాలి. డాక్టర్ కావాలని ఉందని చిన్నప్పటి నుంచి చెబుతున్నది. కానీ నా బిడ్డ కల నెరవేరుతదనుకోలేదు. ఆమె టెన్త్లో, ఇంటర్లో మంచి మార్కులు సాధించింది. కానీ ఎంబీబీఎస్ భారమైన చదువని నేను భయపడే వాడిని. కానీ తాను ఎంబీబీఎస్ చదువుకు వచ్చే దాకా సీఎం కేసీఆర్ సార్ గోదావరిఖనిలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. దీంతో ఎంబీబీఎస్ కొంత దగ్గరైందనిపించింది. కానీ బిడ్డకు సీటు వస్తుందా..? రాదా..! అనే టెన్షన్ మాత్రం నాలో ఉండేది. కానీ బిడ్డ కష్టపడ్డది. ఇక్కడే సీటు వచ్చింది. నా కండ్ల ముందటనే ఎంబీబీఎస్ చదివే అవకాశాన్ని కల్పించిన కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేది. నా కోసం మా మమ్మీడాడీ చాలా కష్టపడ్డారు. వాళ్లను నేను ఏనాడూ నిరాశ పరచకుండా చదివా. సీఎం కేసీఆర్ సార్ కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుడు చూసి నేను కచ్చితంగా ఎంబీబీఎస్ సీటు సాధిస్తా అనుకున్నా. గతేడాది రామగుండంలో మెడికల్ కళాశాలను ప్రారంభించారు. నేను ఇక్కడే ఈ సీటు సంపాదించాలని ఆనాడే అనుకున్నా. అనుకున్నట్టే కష్టపడి చదివి సీటు సంపాదించా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పుట్టి పెరిగిన ఊరిలోనే ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం నాకు దక్కింది. థాంక్యూ కేసీఆర్ సార్.
– కామని జయశ్రీ, ఎంబీబీఎస్ విద్యార్థిని (గోదావరిఖని)