సిరిసిల్ల తెలంగాణ చౌక్, మార్చి 3 : మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆదివారం నిర్వహించిన 5కే రన్ అదిరింది. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ రన్ను ప్రారంభించగా, విశేష స్పందన వచ్చింది. యువతీ యువకులు వందలాదిగా తరలివచ్చి, ఉత్సాహంగా పరుగెత్తారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువతనేని, మత్తుకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. అనంతరం 15మంది విజేతలకు ఒక్కొక్కరికీ ఒక్కో సైకిల్ అందించారు.