కరీంనగర్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీలు జరిగాయి. మూడేళ్లు ఒకే చోట, నాలుగేళ్లు సొంత జిల్లాలో పనిచేసిన వారికి బదిలీలయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్లో 12, జగిత్యాలలో 15, పెద్దపల్లిలో 9, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 మంది చొప్పున మొత్తం 45 మందికి బదిలీ జరిగింది.
కాగా, ఇందులో ఎక్కువ మందిని ఉమ్మడి జిల్లా పరిధిలోనే సర్దుబాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు మరో ఆరుగురిని బదిలీ చేశారు. బదిలీ అయిన ఎంపీడీవోలను సంబంధిత కలెక్టర్లు సోమవారం రిలీవ్ చేయాలని, బదిలీపై వెళ్లిన జిల్లాల్లో ఈ నెల 13న రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత సంబంధిత కలెక్టర్లు ఎంపీడీవోలకు మండలాలను కేటాయిస్తు ఉత్తర్వులు ఇవ్వనున్నారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపీడీఓలలో అడ్డబోయిన శ్రీనివాస్రెడ్డి, సీ రవీందర్రెడ్డి, రావూరి పద్మావతి, ఆవునూరి స్వాతి, ఇనుకొండ స్వరూప, వేముల విజయలక్ష్మి జగిత్యాలకు, ఎన్ రాజీవ్ మల్హోత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాకు, తొడుపునూరి జయశీల జయశంకర్ భూపాలపల్లికి, యాదగిరి భాస్కర్రావు, నీలగిరి దివ్యదర్శన్రావు, కొప్పుల శ్రీనివాస్ పెద్దపల్లికి, గుమ్మడి కల్పనను వరంగల్ జిల్లాకు బదిలీ చేశారు.
జగిత్యాల జిల్లాలో సీహెచ్ శ్రీనివాస్, వెంకటేశ్జాదవ్, జీ సంతోష్కుమార్ను నిజామాబాద్కు, జే పుల్లయ్య, ఎస్ రాజేశ్వరి ఏ సంజీవరావు, కే భీమేశ్, కే ప్రభును కరీంనగర్ జిల్లాకు, ఎస్ జనార్దన్ సిద్దిపేటకు, ఏ పద్మజ, జీ తిరుపతి, బీ శైలజారాణి, ఐ ప్రవీణ్కుమార్ పెద్దపల్లికి, కే నవీన్కుమార్ను యాదాద్రి భువనగిరికి, ఏ రాజేందర్ను రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేశారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎంపీడీవోలలో బీ యాదగిరి, టీ విజయకుమార్, ఆర్ వేణుగోపాల్రావును కరీంనగర్కు, జీ సత్తయ్య, బీ శ్రీనివాసమూర్తి, బీ జయశీల, కే శ్రీనివాస్, వై శశికళను రాజన్న సిరిసిల్లకు, ఎం రాజును ములుగుకు బదిలీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎంపీడీవోల్లో ఎం శంకర్, పీ రవీందర్, ఎస్ రాంరెడ్డి, ఎన్ రాజేందర్రెడ్డి, ఎం శ్రీనివాస్, నీర్ల రమాదేవీ, పీ లచ్చులు, బీ చిరంజీవి, ఓదెల రామకృష్ణను జగిత్యాల జిల్లాకు బదిలీ చేశారు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇతర జిల్లాల నుంచి ఆరుగురు ఎంపీడీఓలను బదిలీ చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు హన్మకొండ నుంచి టీ సునిత, సిద్దిపేట నుంచి బీ మధుసూదన్, ఎం శ్రీధర్, దమ్మని రాము, సిరిసిల్ల జిల్లాకు సిద్దిపేట నుంచి వీ భాస్కరశర్మ, పెద్దపల్లి జిల్లాకు సిద్దిపేట నుంచి జీ శ్రీనివాస్ గౌడ్ను బదిలీ చేశారు.