రామడుగు, ఫిబ్రవరి 20 : రామడుగు మండలం వెలిచాల కొత్తపల్లి మధ్య ప్రయాణికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి కల నెరవేరనున్నది. వానకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే భారీ వరద రోడ్డాం మీదుగా రోజుల తరబడి వెళ్లడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండగా, ఇకపై ఆ అవస్థలు తప్పనున్నాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి తాజాగా, రూ.4.40 కోట్లు విడుదల కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెలిచాల గ్రామ ప్రయాణికులు ఎన్నో దశ్దాలుగా పడుతున్న బాధలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. వెలిచాల క్రాస్రోడ్డు నుంచి వెలిచాలకు వెళ్లే దారి మధ్యలో చాలా ఏళ్ల కిందట రోడ్డాం నిర్మించింది. అయితే, వానకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉండడంతో దాని పైనుంచి రోజుల తరబడి వెళ్లేది. దీంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయేవి. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమం లో రాష్ట్రం రాకముందు అప్పటి ప్రభు త్వం కరీంనగర్లోని పద్మనగర్ బైపాస్ నుంచి చింతకుంట మీదుగా జగిత్యాల రహదారికి కలిసేలా ఈ రోడ్డు ను విస్తరించారు. కానీ, ఇక్కడ బ్రిడ్జి నిర్మించక పోగా, మళ్లీ రోడ్డాంనే విస్తరించారు. దీంతో సమస్య ఎప్పటిలాగే ఉండిపోయింది. పైగా, ఈ రహదారిపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండడంతో వానకాలంలో రో డ్డాం వచ్చినప్పుడు ఇరువైపులా అధికంగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో నీటి ఉధృతికి ప్రయాణికులు వాహనాలతో సహా కొట్టుకుపోయారు. గతేడాది వెలిచాల నుంచి కొత్తపల్లికి వెళ్ళే కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమై చెక్పోస్టును ఏర్పాటు చేశారు.
బ్రిడ్జి నిర్మాణానికి ప్రత్యేక చొరవ
వెలిచాల రోడ్డాం ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఎదురవుతున్న సమస్య పరిష్కారం కావాలంటే బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి అయింది. గ్రామ సర్పంచు వీర్ల సరోజన అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో మాట్లాడి సమస్య వివరించారు. దీంతో కొత్త వంతెన నిర్మాణానికి రూ.4.40 కోట్ల నిధులు మంజూరయ్యాయి. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేయడంపై సీఎం కేసీఆర్, మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, వెలిచాల గ్రామ ప్రజలు, ప్రయాణికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
దశాబ్దాలుగా మా గ్రామస్తులు పడుతున్న అవస్థలను గుర్తించి వంతెన నిర్మాణం కోసం రూ.4.40 కోట్ల నిధులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. వానకాలం వచ్చిందంటే మా గ్రామానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ వంతెన నిర్మా ణం పూర్తయితే మా గ్రామస్తులతోపాటు ఇటు గా వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మా చిరకాల స్వప్నం నెరవేరడానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు.
–వీర్ల సరోజన, సర్పంచ్, వెలిచాల (రామడుగు మండలం)