గుండాల, జూలై 9: పల్లెప్రగతి పనులు పకడ్బందీగా చేయాల ని డీఎల్పీవో యాదగిరి అన్నారు. శుక్రవారం మండలంలోని రామారం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా ప్ర తినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచిం చారు. గ్రామాలు పచ్చగా పరిశుభ్రంగా ఉండాలనీ, పల్లె ప్రగతి లో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలన్నా రు. అంతకుముందు నర్సరీ, పల్లెప్రకృతి వనాలను పరిశీలిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో జనార్ధన్ రెడ్డి, సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ కవిత, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, పీఆర్ఏఈ పూర్ణచందర్రావు, కార్యదర్శి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పనులు
ఆలేరురూరల్: మండలంలోని గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పారిశుధ్య సిబ్బందితో మురుగు కాల్వల పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు చేయిస్తున్నా రు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి వాటిని సంరక్షించాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు.
పరిశుభ్రంగా గ్రామాలు
ఆత్మకూరు(ఎం): గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి పనులతో ప్రతి గ్రామం పరిశుభ్రంగా మారు తున్నదని మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొరటికల్లో వైకుంఠధామం, కం పోస్ట్ షెడ్ నిర్మాణం, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. వివి ధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీడీవో రాములు, ఎం పీవో పద్మావతి, సర్పంచ్లు నర్సింహారెడ్డి, ప్రమీల, గ్రామ ప్ర త్యేకాధికారి సౌమ్య, కార్యదర్శులు శ్రీనివాస్రెడ్డి, నరేశ్, శ్రీని వాస్, శేఖర్, కారోబార్లు కిష్టయ్య, స్వామి పాల్గొన్నారు.
ప్రగతి నిరంతరం కొనసాగుతుంది
ఆలేరు టౌన్: పట్టణ ప్రగతి కార్యక్రమం 10 రోజులే కాకుండా నిరంతరం కొనసాగుతుందని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకర య్య అన్నారు. ఆలేరులోని పలు వార్డుల్లో చేపడుతున్న పనుల ను శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో కమిషనర్ లావ ణ్యలత, కౌన్సిలర్లు రాములు, నర్సింహులు, నాగలక్ష్మి, దయా మణి, సునీత, శ్రీకాంత్, శ్రీకాంత్, కోఆప్షన్ మెంబర్లు రియా జ్, రాజేశ్, బ్యూలా రాణి, లత, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన అధికారులు
యాదగిరిగుట్ట రూరల్: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సం వత్సరాలు అయినందున పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ కి అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా శుక్రవారం ఎన్ హెచ్ 202 మీద ఉన్న మండలంలోని బాహుపేట వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ డి ప్యూటీ ఈఈ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎం పీపీ శ్రీశైలం, జడ్పీటీసీ అనురాధ, ఎంపీడీవో ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ పద్మ, పీఆర్ ఏఈ జానయ్య, రెహమాన్, గ్రామ స్థులు భాస్కర్రెడ్డి, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే పల్లె ప్రగతి..
మోటకొండూర్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చేందుకే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎం పీడీవో వీరస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆయా గ్రామా ల్లో మండల ప్రత్యేకాధికారిని పరిమళాదేవి పనులను సంద ర్శించారు. కాటేపల్లి గ్రామంలో సర్పంచ్ మంత్రి రాజు, కార్యద ర్శి సాయికుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కదిరేణి గూడెంలో సర్పంచ్ వేముల పాండు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు, కార్యద ర్శులు, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.
పండుగలా పల్లె ప్రగతి
బొమ్మలరామారం: పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల తో గ్రామంలోని సమస్యలు తీరి పండుగ వాతావరణం నెల కొంటున్నదని సర్పంచ్ వడ్లకొండ అరుణ అన్నారు. మండలం లోని మైలారంలో శుక్రవారం పల్లె ప్రగతి పనుల్లో భాగంగా కంపచెట్లు తొలగించి పారిశుధ్య పనులను నిర్వహించారు. వీ ధుల్లో ముగ్గులు వేశారు. బతుకమ్మలు పేర్చి పల్లె ప్రగతి ని పం డుగలా గ్రామస్తులు జరుపుకొన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, కార్యదర్శి మల్లికార్జున్, అంగన్ వాడీ టీచర్ సుల్తానా, వార్డు సభ్యులు పాల్గొన్నారు.