సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ లెల్లెల బాలకృష్ణ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గంగపుత్ర సంఘం వద్ద జిల్లా స్థాయి సదస్సులో మాట్లాడారు.. రాష్ట్రంలో 20 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు 2016 నుంచి ప్రతీ సంవత్సరం ఉచితంగా 120 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో 22 చేప పిల్లల కేంద్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో మత్స్యకార్మికులకు చేపల అమ్మకంలో మద్దతు ధర ఇవ్వాలని కోరారు. 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు ప్రతీ నెలా 3 వేల పింఛన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంగళ్ల రాజు, అడ్లూర్ ఎల్లారెడ్డి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు రంగ గంగారాం, సభా అధ్యక్షుడు రంగ ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి పందిరి రాజేశ్, రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శి కరెల్లి లలిత, పందిర శంకరయ్య, ఇస్తారాకుల రవీందర్, రాజవేరి స్వామి, కిషన్, రాజేశ్వర్, కలిగోల శ్రీనివాస్, గాంధారి లింగం, దశరత్, రాజనర్సు, మత్స్యకారులు, కార్మికులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.