కామారెడ్డిలో ఫీవర్ సర్వే సక్సెస్ l 2 ,19,515 లక్షల ఇండ్లు పూర్తి
నిజామాబాద్లో చివరి దశకు.. 2,19,602 ఇండ్లకు వెళ్లిన సిబ్బంది
ఉమ్మడి జిల్లాలో ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్న 2,006 బృందాలు
ఇప్పటివరకు లక్షణాలు ఉన్న 11,273 మంది గుర్తింపు
ఇంటివద్దే మెడికల్ కిట్ల అందజేత
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని అదుపుచేసేందుకు చేపట్టిన జ్వర సర్వే సత్ఫలితాలు ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన సర్వే శనివారం కామారెడ్డి జిల్లాలో ముగియగా.. నిజామాబాద్లో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు వేలాది మంది వివరాలను సేకరించిన ప్రత్యేక బృందాలు అవసరమైన వారికి మెడికల్ కిట్లను ఇంటి వద్దనే అందజేస్తున్నాయి. ఇంటి వద్దే వైద్య సేవలు అందుతుండడంతో బాధితుల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతున్నది. దవాఖానలకు వెళ్లకుండానే హోం ఐసొలేషన్లోనే కోలుకునే అవకాశం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2006 బృందాలను ఏర్పాటు చేయగా..4, 39, 117 ఇండ్లలో సర్వే పూర్తి చేశాయి. మొత్తం 11,273 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడికల్ కిట్లను అందించాయి.
-విద్యానగర్/ ఖలీల్వాడి, మే 9
జ్వర సర్వేతో అనుకున్నదానికన్నా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని పరీక్షించగలిగాం. తీవ్రతను బట్టి దవాఖానకు తరలిస్తున్నాం.
-డాక్టర్ చంద్రశేఖర్,
డీఎంహెచ్వో, కామారెడ్డి
సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్ ఇస్తున్నాం. వారి ఆరోగ్యస్థితిని ఐదురోజులపాటు వైద్య బృందాలు పర్యవేక్షిస్తాయి.
విద్యానగర్/ ఖలీల్వాడి, మే 9: కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు అమలు చేయని విధంగా మన ప్రభుత్వం ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానం పకడ్బందీగా అమలవుతుండడంతో వైర స్ వ్యాప్తి నివారణ సులభతరం అవుతున్నది. ఇప్పటి వరకు వేలాది మంది వివరాలను సేకరించిన ప్రత్యేక బృందాలు అవసరమైన వారికి ఐసొలేషన్ కిట్లను ఇంటి వద్దనే ఇస్తున్నాయి. ఇంటి వద్దే వైద్య సేవలు అందుతుండడంతో బాధితుల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతున్నది. దవాఖానలకు వెళ్లకుండానే పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం కలిగింది. ప్రజలు బయటికి రాకుండా ఎక్కడివారిని అక్కడే పరీక్షిస్తూ, లక్షణాలున్న వారిని గుర్తించి అవసరమై న మందులు అందిస్తున్నారు. దీంతోపాటు వెంట నే చర్యలు చేపడుతుండడంతో కరోనా కట్టడికి బాటలు పడుతున్నాయి. అనుమానం ఉన్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం దవాఖానలకు తరలిస్తున్నా రు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర విషయాలపై వైద్య, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. అర్హులైన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. జ్వర సర్వే ఫలితంగా ముందు చూపుతో కరోనా వైరస్ను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
సులువుగా బాధితుల గుర్తింపు
జ్వర సర్వేలో ఆశ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బం ది, ఇతర శాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. కరోనాతో బాధపడేవారిని ప్రాథమిక దశలోనే గుర్తించి వారికి ఐసొలేషన్ కిట్లు అందిస్తున్నారు. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ పడిపోవడం వంటివి జరిగినప్పుడు దవాఖానలకు తరలిస్తున్నారు. దీంతో చికిత్స అందించడానికి వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. జ్వర సర్వేతో వ్యాధి ప్రాథమిక దశలోనే నయం కావడంతోపాటు తగ్గిన వారికి కొవిడ్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ సర్వే ద్వారా కరోనా బాధితులతోపాటు స్వల్ప లక్షణాలు ఉన్న వారిని కూడా సులభంగా గుర్తించవచ్చు.
కామారెడ్డి జిల్లాలో సర్వే పూర్తి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వే పూర్తయిం ది. జిల్లాలోని 22 మండలాలు, 526 గ్రామ పంచాయతీలు,మూడు మున్సిపాలిటీల్లో 2 లక్షల 10 వేల 957 ఇండ్లను గుర్తించారు. మూడు రోజులపాటు సర్వే నిర్వహించారు. ఇప్పటి వరకు 802 బృందాలతో 2 లక్షల19 వేల 515 ఇండ్లను సర్వే చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్న 4,217 మందిని గుర్తించి ఐసొలేషన్ కిట్లను అందజేశారు. ఐదు రోజులపాటు వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులు తెలుసుకుంటూ ఉంటారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి అజిత్రోమైసిన్, విటమిన్ సి, డి, పారాసిటమల్, జింకోవిట్, ఆవిరి క్యాప్సిల్స్ అందజేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సర్వే
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2, 19, 602 ఇండ్లలో సర్వే చేశారు. మొత్తం 1204 వైద్య బృందాలు జ్వర సర్వే చేపట్టగా.. లక్షణాలు ఉన్న 7,056 మందిని గుర్తించారు. వారికి మందుల కిట్లను అందజేశారు. వెయ్యి మందికి ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేయగా..ఒక్కో బృందంలో ఏఎన్ఎం, ఆశ వర్కర్, వైద్యాధికారులు ఉంటున్నారు. జిల్లా ప్రభుత్వ దవాఖాన, ఆర్మూర్, బోధన్ దవాఖానలతోపాటు పీహెచ్సీలు, యూపీహెచ్సీలు మొత్తం 44 కేంద్రాల్లో సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో 1476 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మందులు అందజేశారు.
ప్రభుత్వ విప్ ఇంటికి సర్వే బృందం
కామారెడ్డి, మే 9 : కొవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేలో భాగంగా వైద్య బృందం ఆదివారం కామారెడ్డిలోని ప్రభుతవిప్ గంప గోవర్ధన్ ఇంటిని తట్టింది. చర్చి కాంపౌండ్లోని గోవర్ధన్ నివాసం వద్దకు వైద్య సిబ్బంది వచ్చారు. ఆ సమయంలో ఇంటి ముందర చెట్టు కింద కూర్చొని ఉన్న విప్ను సార్.. జ్వరం వస్తుందా అని ప్రశ్నించారు. దీంతో వచ్చిన వారు సర్వే సిబ్బంది అని తెలుసుకొని తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని బదులిచ్చారు. ఒకరు మున్సిపల్ ఉద్యోగి కాగా మరొకరు అంగన్వాడీ వర్కర్గా విప్ను పరిచయం చేసుకున్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు.. అందరు ఎలా ఉన్నారని వివరాలు తెలుసుకుని రిజిస్టర్లో నమోదు చేసుకున్నారు. ఫోన్ నంబరు, ఇంట్లో ఐదుగురు ఉంటున్నారని, అందరు ఆరోగ్యంగా ఉన్నరని తెలుపడంతో సర్వే సిబ్బంది రిజిస్టర్లో రాసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటింటి సర్వే ఎలా జరుగుతుందని వారిని అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మందుల కిట్లు, ఐసొలేషన్ వివరాలను వారు ప్రభుత్వవిప్కు వివరించారు.
సర్వేతో ఉత్తమ ఫలితాలు
జ్వర సర్వేతో అనుకున్న దానికన్నా ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని గుర్తించి, పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాం. ప్రతి ఇంటికి తిరిగి కొవిడ్ లక్షణాలు ఉన్నవారి వివరాలను నమోదు చేసి మందులు అందజేస్తున్నాం. తీవ్రతను బట్టి దవాఖానకు తరలిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,217 మంది అనుమానితులను గుర్తించాం. వీరి ఆరోగ్య పరిస్థితిని ఐదు రోజుల పాటు వైద్యాధికారులు పర్యవేక్షిస్తారు.
-డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో, కామారెడ్డి
సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నాం
జిల్లాలో జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉం టే వెంటనే సర్వే బృందానికి చెప్పాలి. జ్వరం, దగ్గు ఉంటే వెంటనే వారికి కరోనా కిట్ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంటి వద్దకే వైద్యా అధికారులు వస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నావారికి, లక్షణాలు ఉన్నావారికి కరోనా కిట్లను అందచేస్తున్నాం. సర్వే బృందాలను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.