కామారెడ్డి, మే 17: కష్టపడితే ఏదైనా సాధ్యమేనని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పట్టుదలతో చదవి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థుల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు హైదరాబాద్కు చెందిన శౌర్య అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. ఉచిత శిక్షణ కోసం కామారెడ్డి నియోజకవర్గంలో 1,201 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్టులో 516 మంది ఎంపికయ్యారు. వీరందరికీ 75 రోజుల పాటు కళాభారతి ఆడిటోరియంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత భోజన సదుపాయంతోపాటు స్టడీ మెటీరియల్ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమకూర్చారు. శిక్షణ తరగతులను ప్రారంభించిన అనంతరం విప్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగ యువతి, యువకులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో సక్సెస్ కావాలనే ఆకాంక్ష, తపన అవసరమన్నారు.
ఉద్యోగం సాధించాలనే కసి, పట్టుదలతో శ్రమించాలని సూచించారు. ఉద్యోగం సాధించే వరకూ విశ్రమించవద్దన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రణాళికాబద్ధంగా చదవాలన్నారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, శౌర్య అకాడమీ డైరెక్టర్ నరేశ్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, ప్రముఖ వ్యాపారవేత్త జనగామ సుభాష్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్, నాయకులు మీర్జా హషీజ్బేగ్, బల్వంత్ రావు, వజ్జపల్లి ఆంజనేయులు, సీఐ ప్రశాంత్రెడ్డి, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.
సెల్ఫోన్కు దూరంగా ఉండండి
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఉద్యోగమే లక్ష్యంగా చదవాలి. ఫోన్లు పక్కనపెడితే ఉద్యోగాలు సాధించినట్టే. ప్రభుత్వ విప్ అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎంకే ముజీబుద్దీన్,
టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు
సమయాన్ని వృథా చేసుకోవద్దు
ఉద్యోగార్థులు సమయాన్ని వృ థా చేసుకోవద్దు. ఉద్యోగ సాధ నే లక్ష్యంగా కష్టపడాలి. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టాలి. అవకాశాలను మెరుగుపర్చుకుంటూ ముందుకుసాగాలి. సిలబస్ ప్రకారం, ప క్కా ప్రణాళికతో చదవాలి. ప్రిపరేషన్తోపాటు డైట్, ఎక్సర్సైజ్, విశ్రాంతిపైన కూడా దృష్టి సారించాలి.
-జితేశ్ వీ పాటిల్, కలెక్టర్
శ్రమిస్తే విజయం తథ్యం
శ్రమిస్తే విజయం తథ్యం. ఉద్యోగాల కోసం పోటీపడుతు న్న ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. పోలీసు ఉద్యోగాల్లో కామారెడ్డి జిల్లాలో 259 ఖాళీలు ఉన్నాయి. కష్టపడి చది వి ఉద్యోగాలు సాధించాలి. మే ము చదువుకున్న రోజుల్లో కోచింగ్ సెంటర్లు లేవు. ఇప్పుడున్న అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
– బి.శ్రీనివాస్రెడ్డి, కామారెడ్డి ఎస్పీ