నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 6 : జిల్లా వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆరో రోజైన మంగళవారం గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతోపాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
పిట్లం మండల కేంద్రంలో విద్యుత్శాఖ ఏఈ బుజ్జిబాబు శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ నిర్వహించారు. బంజరాతండాలో ప్లాస్టిక్ సేకరణ ప్రక్రియను ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. పిట్లం మండలకేంద్రంలోని పలు కాలనీల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవళిక పర్యటించి తాగునీటి సరఫరా గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
లింగంపేట మండలంలోని భవానీపేట, లింగంపేట గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు ఏలేటి శ్రీలత పాల్గొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో అధికారులు, నాయకులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం మండల కేంద్రంలో రూ. 65 లక్షలతో నిర్మిస్తున్న పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. ఆమె వెంట లింగంపేట సర్పంచ్ బొల్లు లావణ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విఠల్రెడ్డి, లింగంపేట సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి, స్థానిక సంస్థల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్రెడ్డి, టీఆర్ఎస్ యూత్ విభాగం మండల అధ్యక్షుడు నరేశ్ ఉన్నారు.
ఐలాపూర్ గ్రామంలో సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి మొక్కలు నాటారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పవర్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్ సమస్యలను అధికారులు గుర్తించారు. సదాశివనగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సర్పంచులు, అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఇంటికొక మరుగుదొడ్డి తప్పనిసరి అన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో అంగన్వాడీ, ఆశవర్కర్లకు మొక్కలు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. సదాశివనగర్లో మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచులు పైడి జానకి, బద్ధం శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, ఎస్ఎంసీ చైర్మన్ సాయిలు, ప్రత్యేకాధికారులు నామాల లక్ష్మీనర్సయ్య, అబ్బలింగం పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ పరిధిలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ మనోహర్ పాల్గొన్నారు. పల్లెప్రకృతివనంలో మొక్కలను నాటేందుకు స్థలాలను గుర్తించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, మండల ప్రత్యేకాధికారి సంజీవ్రావు, ఎంపీడీవో పర్బన్న, ఎంపీవో అబ్బాగౌడ్ పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం మోషంపూర్లో సర్పంచ్ మంజుల ఇంటికి ఆరుమొక్కల చొప్పున పంపిణీ చేశారు. నస్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లిలో వైకుంఠధామాన్ని ఎంపీపీ విఠల్ పరిశీలించి మొక్కను నాటారు. బొప్పాస్పల్లిలో సర్పంచ్ హన్సీబాయి ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. మైలారం విండో చైర్మన్ శ్రీనివాస్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఎంపీవో రాము పాల్గొన్నారు. బీర్కూర్ మండలంలోని రైతునగర్లో అధికారులు, గ్రామస్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, బోర్లం క్యాంపు తండా గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి అశోక్ పల్లెప్రగతి పనులను సర్పంచ్ సరళతో కలిసి పరిశీలించారు.
కామారెడ్డిలోని 36వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ మొక్కను నాటారు.
బీబీపేట్తో పాటు కోనాపూర్, జనగామ, శివారు రాంరెడ్డిపల్లి, మాందాపూర్ తదితర గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గ్రామస్తులకు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ను వాడితే రూ.వేయి జరిమానా విధించాలని తీర్మానించారు. బిచ్కుంద మండలంలోని చిన్నదడ్గిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ర్యాలీ నిర్వహించారు. ఎంపీవో మహబూబ్ పాల్గొని ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.