నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 29: రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటి నుంచి చేపట్టబోయే ఏడో విడుత హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. మంగళవారం సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని, ప్రతి గ్రామంలో లక్ష్యం మేరకు మొక్కలను నాటి విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. పల్లెలను అభివృద్ధి బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంపై మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
వీటితోపాటు పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. కామారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నాగేశ్వర్, ఎంపీవో మల్హారీ, ఆయా గ్రామాల సర్పంచులు చింతల రవితేజాగౌడ్, జ్ఞానేశ్వర్, సాగర్గౌడ్, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దోమకొండ మండలంలో హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలపై జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఎంపీపీ కోట సదానంద ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో చెన్నారెడ్డి, ఎంపీవో తిరుపతి, వైస్ ఎంపీపీ బాపురెడ్డి, ఏపీవో రజిని, ఏఈలు, సర్పంచులు అంజలి, సుర్యప్రకాశ్రెడ్డి, కరికె సుమలత, నాంపల్లి, సెక్రటరీలు సౌజన్య, సుధాకర్, కృష్ణ పాల్గొన్నారు. బీర్కూర్ మండలంలో ప్రత్యేకాధికారి నర్సిరెడ్డి పల్లె ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, సూపరింటెండెంట్ భరత్కుమార్, ఎంపీవో అనితారెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో మండల ప్రత్యేకాధికారి సంజీవ్రావు సమావేశం ఎంపీడీవో పర్బన్న, మండల పంచాయతీ అధికారి అబ్బాగౌడ్, ఈసీ గణేశ్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులతో ఎంపీపీ రాజ్దాస్ సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్, ఈసీ మధు పాల్గొన్నారు. లింగంపేట సెర్ప్ కార్యాలయంలో పల్లెప్రగతి కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారిణి రజిత అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ గరీబున్నీసా బేగం, ఎంపీడీవో శంకర్నాయక్, మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బీబీపేట్లో స్పెషల్ ఆఫీసర్ జితేంద్రప్రసాద్, ఎంపీడీవో నారాయణ ఎంపీపీ బాలామణి అధ్యక్షతన పల్లెప్రగతి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో మిషన్భగీరథ వాటర్ ట్యాంకులు నిండక తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని సంబంధిత ఏఈకి దృష్టికి తీసుకెళ్లి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ స్తంభాలు, లూజువైర్లు సరిచేయాలని పలు మార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. రామారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో విజయ్కుమార్ పల్లె ప్రగతి, హరితహారంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఎంపీవో సవితారెడ్డి, జడ్పీటీసీ నారెడ్డి మోహన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హరితహారం విజయవంతం చేయాలి: జడ్పీ సీఈవో
ప్రతి గ్రామంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీసీఈవో సాయాగౌడ్ అన్నారు. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. ఖాళీ ప్రదేశాల్లో గుంతలు తవ్వి మొక్కలు నాటాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఎండిపోయిన మొక్కల స్థలంలో మళ్లీ కొత్త మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవో ఆనంద్, ఎంపీవో మహబూబ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.