ఎదులాపురం, జూలై 8 : జిల్లా వైద్యారోగ్య శాఖద్వారా ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేస్తున్నామ ని అడిషనల్ డీఎంహెచ్వో సాధన అన్నారు. స్టాఫ్నర్సు పోస్టుల జాబితాను విడుదల చేయగా, జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో మొ దటి ఐదుగురికి 1ః 5 నిష్పత్తి ప్రకారం గురువా రం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సెలక్షన్ కమి టీ సమక్షంలో వీటిని చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్వో మాట్లాడుతూ.. స్టాఫ్నర్సు పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపర్చామన్నారు. ఎవరైతే ఇంటర్వ్యూకు హాజరు కావాలో వారికే కాల్లెటర్ పంపించామని పేర్కొన్నారు. ఎట్టిపరిస్ధితుల్లో అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఇది తెలియక దరఖాస్తు చేసుకున్న పలువురు అభ్యర్థులు ఉదయం డీఎంహెచ్వో కార్యాలయానికి చేరుకోగా, తమకు అర్హత ఉన్నా ఎందుకు ఇంటర్వ్యూకు పిలువలేదని ప్రశ్నించారు. సెలక్షన్ కమిటీ సమక్షంలోనే ఇంటర్వ్యూలకు ఎంపిక చేశామని అడిషనల్ డీఎంహెచ్వో స్పష్టంచేశారు. ఏమైనా అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా డీఎంహెచ్వో, కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఇంటర్వ్యూలో సెలక్షన్ కమిటీ సభ్యులు, ఉట్నూర్ ప్రభుత్వ దవాఖాన డాక్టర్లు దీపక్, క్రాంతి, డీఎస్వో, డాక్టర్ వైసీ శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి కార్యాలయ సూపరింటెండెంట్ వేణుగోపాల్ ఉన్నారు.