అయిజ, జూన్ 19 : రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. ఎస్సై జగదీశ్వర్ కథనం మేరకు.. గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఎరుకలి జమ్మన్న (49) బైక్పై గద్వాల నుంచి శుక్రవారం రాత్రి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అయి జకు చెందిన కాకె నర్సప్ప బైక్పై వెళ్తూ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్పీ గ్యాస్ గోదాం సమీపంలో మలుపు వద్ద జమ్మన్న వెళ్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జమ్మన్నకు తీవ్ర గాయాలు కాగా, పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా, శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి అల్లుడు పాం డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు.