ముంబై : రిటైల్ ఇన్వెస్టర్, డీమార్ట్ సంస్థ యజమాని రాధాకృష్ణన్ దమాని ముంబై మహానగరంలో ఇల్లు కొనుగోలు చేశారు. సంపన్న ప్రాంతాల్లో ఒకటైన ముంబైలోని మలబార్ హిల్లో ఆయన ఇల్లు కొన్నారు. ఇల్లు ధర కేవలం రూ.1000 కోట్లేనంట.
రూ.724 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 5752.22 చదరపు అడుగుల ఇంటిని పుమచంద్ రాయ్చంద్ & సన్స్, పరేష్చంద్ రాయ్చంద్ & సన్స్, ప్రేమ్చంద్ రాయ్చంద్ & సన్స్ నుంచి దమాని, ఆయన సోదరుడు గోపికిషన్ కొనుగోలు చేశారు.ఆస్తి కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కోసం దమాని రూ.30 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది మార్చి 31 న ఈ ఆస్తిని కొనుగోలు చేశారు.
కాగా, థానేలో కూడా దమాని భూమిని కొనుగోలు చేశారు. 8 ఎకరాల ల్యాండ్ పార్శిల్ను మొండెలెజ్ ఇండియా నుంచి (గతంలో క్యాడ్బరీ ఇండియా) దాదాపు రూ.250 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. థానే ముఖ్య ప్రాంతమైన పోఖరన్ రోడ్ 1 వద్ద ఈ ప్లాట్లు ఉన్నాయి. లావాదేవీ గత వారం ముగిసిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.
ముంబై టెన్మెంట్ బ్లాక్లోని ఒక గది అపార్ట్మెంట్లో జీవితాన్ని ప్రారంభించిన రాధాకృష్ణన్ దమాని.. ప్రముఖ రిటైల్ చైన్ డీమార్ట్ దుకాణాలను కలిగి ఉన్నారు. ఫోర్బ్స్ ఇండియా 2020 జాబితా ప్రకారం, దమాని 15.4 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన నాలుగో ధనవంతుడుగా ఉన్నారు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొద్దిరోజులపాటు వ్యాపారాలకు ఎదురుదెబ్బలు తగిలిన తరువాత, గత ఏడాది అక్టోబర్లో ముంబైలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకున్నది. నగరంలో ఆస్తి అమ్మకాలు 112 శాతం పెరిగాయి.
ముంబైలో ఖరీదైన ఆస్తులను కొనడం భారతదేశపు అగ్ర వ్యాపారవేత్తలకు కొత్తేమీ కాదు. 2015 లో పూనవాల్లా గ్రూప్ చైర్మన్ సైరస్ పూనవాల్లా ఐకానిక్ లింకన్ హౌస్ను రూ.750 కోట్లకు కొనుగోలు చేశారు.
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్ఖాన్
లైవ్లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..