బొల్లారం,ఏప్రిల్ 19 : కంటోన్మెంట్(Cantonment) బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితను(Niveditha) భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ ఏడో వార్డు పరిధిలోని తిరుమలగిరి ఓల్డ్ గాంధీ నగర్లో బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ శ్యాం కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ నియోజవర్గానికి ఎంతో కృషి చేశారని, సాయన్న కుమార్తె నివేదితను ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు యశ్వంత్ కుమార్, రాజిరెడ్డి, సురేష్, దుర్గా ప్రసాద్, సోమయ్య, సువర్ణ, సుష్మలత, రజిని, తదితరులు పాల్గొన్నారు.