డిచ్పల్లి: మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం డిచ్పల్లి మండల కేంద్రంలోని సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఈసీ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలు సకాలంలో తిరిగి చెల్లించే విధంగా చూడటంతో పాటు రుణాలు ఎన్పీఏ కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
తీసుకున్న రుణాలు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు వాడే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఉషారాణి, కార్యదర్శి సుభాషిణి, కోశాధికారి లలిత, డీఆర్డీవో చందర్నాయక్, ఏపీడీ మధుసూదన్, డీపీఎంలు, ఏపీఎంలు, అన్ని మండల సమాఖ్యల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.