కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బ్యారేజీలోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. గురువారం గోదావరి నుంచి 2,12,082 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 21,3082 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలాగే ప్రాజెక్టులోని 34గేట్లను ఎత్తి 1,94,200 క్యూసెక్కులను ఔట్ ఫ్లో వదులుతున్నట్లు తెలిపారు. బ్యారేజ్లో 10.87 టీఎంసీ నీరుకు గాను 04.95టీఎంసీ నీరు ఉన్నట్లు తెలిపారు. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి నది 06.87 మీటర్ల ఎత్తులో పారుతూ తగ్గుతు వస్తుంది.