ఎమ్మెల్యే టీ.రాజయ్య
స్టేషన్ఘన్పూర్టౌన్, ఏప్రిల్1: నియోజక వర్గంలోని లింగాలఘనపూర్, రఘునాథపల్లి మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10.79 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పాతబస్టాండ్ నుంచి శివునిపల్లి రైల్వేగేట్ వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాగారం నుంచి కుందారం నవాబ్పేట మీదుగా లింగాలఘనపురానికి 8.29 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల55 లక్షలు, రఘునాథపల్లి మండలంలోని పిట్టలగూడెం నుంచి కుందారం మీదుగా బాంజీపేట వరకు 6. 85 కిలో మీటర్లు, రఘునాథపల్లి మండలంలోని పిట్టలగూడెం ఆర్అండ్బీ రోడ్డు నుంచి కోల్కొండ ఆర్బీ రోడ్డు బాంజీపేట, కన్నాయపల్లి, కోడారు మీదుగా రామచంద్రపురం వరకు 4.75 కిలో మీటర్ల బీటీ రోడ్డు పనులకు రూ.2.23 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం పీఎంజీఎస్వై-3 కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గ్రామీణ రోడ్లు, వంతెనల నిర్మాణ ప్రతిపాదనలు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిపారు. నిధులు మంజూరైనందున పనులు త్వరగా చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.
స్టేషన్ఘన్ఫూర్ పాత బస్టాండ్ నుంచి శివునిపల్లి రైల్వేగేట్ వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్అండ్బీ పరిధిలోని ఇళ్లను స్వచ్ఛందంగా తొలగించుకున్నందున ఈ నెల లోగా బీటీ రోడ్డు పనులు పూర్తి చేసేలా ఆర్అండ్బీ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించామని ఆయన తెలిపారు. సమావేశంలో జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖ, వైస్ చైర్మన్ చల్లా సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు, సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు టీ. సురేశ్కుమార్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సింగపురం దయాకర్, ఎంపీటీసీలు నర్సింహులు, రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్, పట్టణ అధ్యక్షుడు బైరి బాలరాజు, ఎం. రాజు, గ్రామ పంచాయతీ ఈవో పున్నం శ్రీనివాస్, ఉప సర్పంచ్ నీల ఐలయ్య, పార్టీ నాయకులు గోనెల ఉప్పలయ్య, చట్ల రాజు, నీలం సుధాకర్, చెరిపల్లి రామల్లు, చింత భరత్కుమార్, మార్కెట్ డైరెక్టర్లు గట్టు మనోహర్, తోట సత్యం, గట్టు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
హైదరాబాద్-హుబ్లీ విమాన సర్వీసులు పున:ప్రారంభం
ఏపీ నుండి తెలంగాణ ఉద్యోగుల రిలీవ్