కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హన్మంతు కే జెండగే
దమ్మూరు, సర్వాయిపేట, ముకునూరు గ్రామాల్లో సుడిగాలి పర్యటన
పలిమెల, జూలై 30 : మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన బిడ్డలకు అండగా ఉంటామని కలెక్టర్ కృష్ణఆదిత్య అన్నారు. శుక్రవారం ఏటూరునాగారం పీవో హన్మంతు కే జెండగేతో కలిసి మండలంలోని దమ్మూరు, సర్వాయిపేట, ముకునూరు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దమ్మూరు గ్రామంలో త్రీఫేస్ కరంటు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, అలాగే పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని గిరిజనులు కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే త్రీఫేస్ కరంటు వచ్చే లా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవోను ఆదేశించారు. 2005 కంటే ముందు సాగు చేసుకుంటున్న పోడు భూ ములను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన యువతతో మాట్లాడుతూ.. ఆైన్లెన్ క్లాసులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. చదువు వల్ల అభివృద్ధి ఉంటుందని, అందరూ కష్టపడి చదివి ఉన్నతస్థాయి కి చేరాలన్నారు.
తెలంగాణకు హరితహారంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చిన్నగా ఉ న్నాయని, డీఆర్డీఏతో మాట్లాడి పెద్ద మొక్కలు తీసుకువచ్చి నాటాలన్నారు. సర్వాయిపేట ఆర్అండ్బీ రోడ్డు గుం తలు పడినందున గ్రామ పంచాయతీ నిధులతో పూడ్చాలని ఎంపీడీవో ప్రకాశ్రెడ్డిని ఆదేశించారు. ముకునూరులో తాగు నీటి సమస్య, పలిమెలలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లేకపోవడంతో వైద్యం కోసం సుదూరంలో ఉన్న అంబట్పల్లి, మహదేవపూర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, పలిమెలలో పీహెచ్సీని ఏర్పాటు చేయాలని ఎంపీపీ బుచ్చక్క, జడ్పీటీసీ హేమలత కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన పలిమెలలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఏర్పాటును పరిశీలిస్తానని తెలిపారు. శనివారం ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సర్వాయిపేటలో సమావేశం నిర్వహించి సమస్యలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఈసీ నాగేందర్, తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శివ, ఆర్ఐ సౌభాగ్యవతి, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.