న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. జహా వోట్.. వహా వ్యాక్సినేషన్ అన్న ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టారు. నగరంలోని పోలింగ్ స్టేషన్లలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దీని కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని సీఎం కేజ్రీ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ మరో నాలుగు వారాల్లోగా 45 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మీరెప్పుడు ఓటు వేసే పోలింగ్ బూత్కు వెళ్లి, అక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ సెంటర్లకు ఎక్కువగా ప్రజలు రావడం లేదని సీఎం అన్నారు. రానున్న రెండు రోజుల్లో బూత్ లెవల్ ఆఫీసర్ల బృందం ఇంటింటికి వెళ్తుందని, వ్యా్సిన్ తీసుకోనివారికి టీకా స్టాట్ ఇస్తామని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని బీఎల్వో ఆఫీసర్లు గుర్తిస్తారన్నారు. 70 వార్డుల్లో నేటి నుంచే ఆ ప్రచారాన్ని మొదలుపెడుతున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.