చేతల ప్రధాని కాదు..
రైతులపై ఇంత విద్వేషమా?
వారి ఆదాయం రెట్టింపు చేస్తామని.. ఎరువుల ధరలు చేశారు..
కేసీఆర్ నాయకత్వం కోసంఎదురుచూస్తున్న దేశ ప్రజలు
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 14 (నమస్తేతెలంగాణ) : నరేంద్రమోదీ.. మాటల ప్రధాని తప్ప చేతల ప్రధాని కాదని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి 2018 ఎన్నికల్లో గెలిచి.. రైతులపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి అవసరమైన అన్ని ఎరువుల ధరలను రెట్టింపు చేశారని, పంటలకు మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యారని తెలిపారు. 2018-19లో కాంప్లెక్స్ ఎరువుల ధరలను 2022 నాటికి 50 నుంచి వంద శాతానికి పెంచారని పేర్కొన్నారు. 2018-19లో డీఏపీ ధర రూ.1,250 నేడు రూ.1,760, పొటాష్ రూ.850 నుంచి రూ.1,200కు, 20:20 ధర రూ.872 నుంచి రూ.1,377కు, 28:28 ధర రూ.1270 నుంచి రూ.1,900కు పెంచారని వివరించారు. డీజిల్, పెట్రోల్ రేట్లను పెంచడం వల్ల పొలం దున్నే ఖర్చు, కూలీల రేట్లు, పెట్టుబడి రెండింతలు పెరిగాయని తెలిపారు. ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖరాస్తే సమాధానం చెప్పకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ను జైలుకు పంపిస్తామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు అవాకులు చెవాకులు పేల్చుతూ తొండి పంచాయితీకి దిగుతున్నారని అన్నారు. కేసీఆర్ను ముట్టుకునే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ను టచ్ చేస్తే యావత్ దేశం మొత్తం భష్మమైపోతుందన్నారు. రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రిపై దిగుమతి నాయకులు ఇష్టం మాట్లాడితే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
దేశ రాజకీయాల్లో సెమీ ఫైనల్స్గా చెబుతున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదన్నారు. ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ నుంచి ఇప్పటికే మంత్రులు వలస పోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రరూపం దాల్చుతున్నదని, వ్యాక్సిన్ తీసుకుంటే రక్షణగా ఉంటుందని తెలిపారు. ఓమిక్రాన్ వ్యాపిస్తున్నందున రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. 60 ఏండ్లు పైబడిన వారు బూస్టర్ డోసు వేసుకోవాలన్నా రు. అనంతరం ఎమ్మెల్యే కొద్దిసేపు పతంగిని ఎగురవేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ హరిబాబు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అద్యక్షుడు జనార్దన్, ప్రధాన కార్యదర్శి బీబీ పాటిల్, పీఏసీఎస్ చైర్మన్ సంపత్కుమార్, కోఆప్షన్ సభ్యురాలు వజ్రమణి, కౌన్సిలర్లు రవి,రాజు, అనిల్, మురళీ, స్వామి, రేణుక, మహిళా అధ్యక్షురాలు తిరుపతమ్మ, జిల్లా నాయకులు సాంబమూర్తి, సిద్దు, రాజబాబు, శ్రీకాంత్పటేల్, కరాటే శ్రీనుతోపాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.