వరంగల్, ఆగస్టు 25(నమస్తేతెలంగాణ) : పోలింగ్ సమీపించడంతో వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. గెలుపు కోసం రెండు ప్యానళ్లలోని అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలను అమల్లోకి తెస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తెల్లవారుజామునే చేరుకుని క్యాంపెయిన్ చేస్తున్నా రు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతున్నారు. రెండు ప్యానళ్లలోని అభ్యర్థులు నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఓటర్లు ఎందరంటే..
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందింది. వర్తక సంఘం పేరుతో వరంగల్లో 1948 సెప్టెంబర్ 28న 200 మంది సభ్యులతో ఆవిర్భవించింది. పునర్వ్యవస్థీకరణతో వర్తక సంఘం పేరు 1950లో చాంబర్ ఆఫ్ కామర్స్గా మారింది. యాభై ఏళ్లకు 2000 సంవత్సరంలో ఇది వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీగా ఎదిగింది. 1998 నవంబర్ 10న స్వర్ణోత్సవాలు జరుపుకొంది. ప్రస్తుతం 73వ వ సంతంలోకి అడుగుపెట్టింది. ఓటర్ల సంఖ్య 1,089కి చేరింది. చాంబర్ ఎన్నికలు చివరిసారి 2018 ఏప్రిల్ 20న జరిగాయి. అప్పట్లో ఓటర్ల సంఖ్య 950. గత ఎన్నికల్లో చాంబర్ అధ్యక్షుడిగా దిడ్డి కుమారస్వామి(డీకే), ఉపాధ్యక్షుడిగా సాదుల దామోదర్, ప్రధాన కార్యదర్శిగా తోట నర్సింహారావు, సంయుక్త కార్యదర్శిగా శ్రీరాం రవి, కోశాధికారిగా కొత్త కిశోర్కుమార్, కార్యవర్గ కమిటీ సభ్యులుగా కంచ సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం భిక్షపతి, గిరబోయిన రాజయ్యయాదవ్, అనబోతుల రాజు గెలుపొందారు. కమిటీ చైర్మన్ దిడ్డి కుమారస్వామి కో ఆప్టెడ్ సభ్యుడిగా దేశబత్తుల రమేశ్బాబును నియమించారు. కార్యనిర్వాహక కమిటీ పదవీకాలం రెండేళ్లు. ఏడాది క్రితమే దీని పదవీ కాలం ము గిసినప్పటికీ కరోనా నేపథ్యంలో ఎన్నిక జోలికి వెళ్లలేదు. కరోనా తీవ్రత తగ్గడంతో ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయించింది. ఎన్నికల్లో 1,089 మంది వ్యాపారులకు ఓటు వేసే అవకాశం ఉంది.
రెండు ప్యానళ్ల ఢీ..
వరంగల్ వ్యాపార రంగంలోని ముఖ్యులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. రెండు ప్యానళ్ల నుంచి ఇరవై మం ది పోటీలో ఉన్నారు. ఈ ఇండస్ట్రీ కార్యనిర్వాహక కమిటీలో అధ్యక్షుడు సహా పది మందిని ఎన్నుకోవాల్సి ఉం టుంది. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు, ప్రధాన కా ర్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఐదుగురు కార్యవర్గ సభ్యులు ఉంటారు. ప్రతి పదవికి ఇద్దరేసి పోటీకి దిగారు. ఒక్కో ప్యానల్ నుంచి ఒకరు చొప్పున రెండు ప్యానళ్ల నుంచి ఇరవైమంది రంగంలో ఉన్నారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రస్తుత అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి తన తరఫున ఒక ప్యానల్ను బరిలో నిలిపారు. ఈ డీకే ప్యానల్లో సాదుల దామోదర్ అధ్యక్ష, కట్కూరి సత్యనారాయణ ఉపాధ్యక్ష, తోట నర్సింహారావు ప్రధాన కార్యదర్శి, శ్రీరాం రవి సంయు క్త కార్యదర్శి, బండి జనార్దన్ కోశాధికారి పదవికి, ఓనబోతుల రాజు, కంచ సంపత్, గౌరిశెట్టి శ్రీనివాస్, భార త రవీందర్, వోడ్నాల రాజేందర్ కార్యవర్గ సభ్యుల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మరో ప్యానల్ నుంచి పది మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఈ ప్యానల్లో బొమ్మినేని రవీందర్రెడ్డి అధ్యక్ష, మొగిలి చంద్రమౌళి ఉపాధ్యక్ష, మడూరి వేదప్రకాశ్ ప్రధాన కార్యదర్శి, సాగర్ల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి, అల్లె సంపత్ కోశాధికారి పదవికి, మేకల రవి, కైలాస హరినాథ్, గాజుల సుమన్, వెల్ది చక్రధర్, సుదాటి రాజేశ్వర్రావు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యేందుకు తలపడుతున్నారు. బలమైన అభ్యర్థులు బరిలో నిలువడంతో పోటీ వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది.
హోరాహోరీగా ప్రచారం..
కాశీబుగ్గ : వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎన్నికల ప్రచారం వరంగల్ ఎనుమాము ల వ్యవసాయ మార్కెట్ పరిధిలో హోరాహోరీగా నిర్వహించారు. రెండు ప్యానెళ్ల అభ్యర్థులు వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న బొమ్మనేని రవీందర్రెడ్డి ప్యానెల్ అభ్యర్థులు, మద్దతుదారులు, సాదుల దామోదర్ ప్యానెల్ అభ్యర్థులు మద్దతుదారులు ప్రచారం చేశారు. కార్యక్రమంలో బొమ్మినేని రవీందర్రెడ్డి ప్యానెల్ అభ్యర్థులు మొగిలి చంద్రమౌళి, మడూరి వేదప్రకాశ్, సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, మేకల రవి, కైలాస హరినాథ్, గాజుల సుమన్, వెల్ది చక్రధర్, సుదాటి రాజేశ్వరరావు, డీకే బలపరిచిన సాదుల దామోదర్ ప్యానెల్ అభ్యర్థులు కట్కూరి సత్యనారాయణ, తోట నర్సింహారావు, శ్రీరాం రవి, బండి జనార్దన్, ఎనబోతుల రాజు, కంచె సంపత్, గౌరిశెట్టి శ్రీనివాస్, భారత రవీందర్, వొడ్నాల రాజేందర్ ప్రచారంలో పాల్గొన్నారు.