గీసుగొండ, సెప్టెంబర్ 18 : వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల శివారులో నిర్మిస్తున్న టెక్స్టైల్ పార్కులో 150 ఎకరాల్లో రూ.వెయ్యికోట్లతో పరిశ్రమ స్థాపించేందుకు కేరళ రాష్ర్టానికి చెందిన కిటెక్స్ గార్మెంట్స్ పరిశ్రమ చైర్మన్ సాబుజాకబ్ శనివారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ తాజ్కృష్ణలో జరిగిన ఈ సమావేశంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సబితాఇంత్రదారెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఈ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టెక్స్టైల్ పార్కులో కిటెక్స్ కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, పరిశ్రమలను ఆకర్షించడంలో ఉన్నతస్థానంలో ఉందన్నారు. కిటెక్స్ కంపెనీలో తయారయ్యే దుస్తులకు రాష్ట్రంలో మంచి ధర కూడా లభిస్తుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో పత్తి పండించే రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు.
ఈ పరిశ్రమలో మహిళలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సుమారు 9వేల మంది కి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పత్తి సాగులో మార్పు లు తీసుకొస్తామని, యంత్రాలతో సాగు చేసే విధానంలో రైతులను ప్రోత్సహిస్తామన్నారు. కిటెక్స్ కంపెనీ చైర్మన్, ప్రతినిధులు ఇప్పటికే పార్కును సందర్శించి, ప్రభుత్వం వారికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. పార్కులో మౌలిక సదుపాయాలు, వాతవారణంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న ఇండ్రస్ట్రీయల్ పాలసీని మెచ్చి పరిశ్రములు తెలంగాణ బాటా పడుతున్నట్లు కిటెక్స్ చైర్మన్ తెలిపారు. త్వరాలోనే అనేక దేశాల నుండి పార్కులో పెట్టుబడులు పెట్టేందు కంపనీలు వస్తున్నట్లు అయన తెలిపారు.