హనుమకొండ, డిసెంబర్ 6 : సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైన దేవాలయాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ చొరవతో పూర్వవైభవం సంతరించుకున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పీఆర్సీ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 114 విడుదల చేసిన సందర్భంగా అర్చక ఉద్యోగులు మంత్రి ఎర్రబెల్లిని సోమవారం హనుమకొండ రాంనగర్లోని ఆయన నివాసంలో దేవాదాయశాఖ అర్చక ఉద్యో గ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ ఆధ్వర్యంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదాయశాఖలో కట్ ఆఫ్ తేదీ తొలగించి మిగిలిన 1252 మంది తాతాలిక అర్చక ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని, వారికి కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అర్చక ఉద్యోగులకు ఇలా వేతనాలు లేవన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.152 కోట్లు కేటాయించి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలను ఇస్తున్నామన్నారు.
కేసీఆర్ దిశా నిర్దేశంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి బాగా పని చేస్తున్నారని ఎర్రబెల్లి కొనియాడారు. దేశానికి మన అర్చకుల వేతన విధానం ఆదర్శమన్నారు. యాదాద్రి ఆలయాన్ని రూ.1800 కోట్ల నిధులతో దేశంలో అత్యున్నత దేవాలయంగా సీఎం తీర్చిదిద్దుతున్నారన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అద్దంకి కిరణ్కుమార్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నరేశ్శర్మ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అభిలాష్శర్మ, భీమన్నశర్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని దళితవాడలను రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దళిత ప్రజల సంక్షేమానికి దళితబంధుతో పాటు పలు పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. అంబేద్కర్ అందరివాడన్నారు. న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంసర్త అని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా ఆయనేనని తెలిపారు.
మహర్ కులానికి చెందిన అంబేదర్ చిన్ననాటి నుంచే కుల వివక్ష, అంటరానితనాన్ని ఎదురొన్నాడన్నారు. దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలుండాలని మొదట పోరాటం చేసింది కూడా ఆయనేనన్నారు. అంబేదర్ రాసిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం అని తెలిపారు. సీఎం కేసీఆర్ అంబేదర్ స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారన్నారు. ఆయన ఆశయాలను సాధించడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు.
దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేశామన్నారు. దళిత విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే విదేశాల్లో చదువుకొనే వారికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి ద్వారా ఒక్కొక్కరికి రూ.20లక్షల ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.