చెన్నారావుపేట, జూన్ 14: ఆపదలో ఉన్న మహిళలు సఖీ సేవలను వినియోగించుకోవాలని కౌన్సిలర్ నూర్జాహాన్ సూచించారు. మండలంలోని అమీనాబాద్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు-వాటి పరిష్కార మార్గాలపై సోమవారం ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నూర్జాహాన్ మాట్లాడుతూ గృహహింస, వరకట్న వేధింపులు, మహిళల అక్రమ రవాణా, ప్రేమ పేరుతో వంచించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు భద్రత కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖీ కేంద్రాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేశాయన్నారు. గ్రామ ప్రజలకు సఖీ కేంద్రం సభ్యులు అందించే సేవలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 181, 08718-295014 నంబర్లకు ఫోన్ చేసి సత్వర సేవలు పొందాలని సూచించారు. నర్సంపేటలోని సాయినగర్కాలనీలో ఉన్న సఖీ కేంద్రంలో నేరుగా సంప్రదించొచ్చన్నారు. కార్యక్రమంలో సిబ్బంది హెచ్ నిర్మలాదేవి గ్రామస్తులు పాల్గొన్నారు.