స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య
చిలుపూరు, మే 18: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని రాజవరంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా మండల అధికార ప్రతినిధి మారుపెల్లి శ్యామ్కుమార్రెడ్డికి తెలుపాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి రంగు రమేశ్, ఎస్సీసెల్ నాయకుడు గడ్డమీది వెంకటస్వామి, సిరిగిరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ పాల్గొనారు.
కరోనా బాధితుడికకి పరామర్శ
స్టేషన్ఘన్పూర్: కరోనాను జయించిన యువకుడిని ఎమ్మెల్యే రాజయ్య పరామర్శించారు. శివునిపల్లికి చెందిన టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి ముగుదుంపురం కిశోర్ కుమారుడు రాహుల్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 20 రోజుల క్రితం అతడికి పాజిటివ్ కాగా, 15 రోజులపాటు శివునిపల్లిలోని హోం క్వారంటైన్లో ఉండి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ మేరకు ఎమ్మెల్యే రాహుల్ను కలిసి మనోధైర్యం చెప్పారు. రాజయ్య వెంట టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బైరి బాలరాజు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు చిగురు సరితా ఆంజనేయులు, ఎండీ అబ్దుల్, సీహెచ్ అనిల్, ఏఎన్ఎం ప్రభావతి ఉన్నారు.