మరో ముగ్గురి నామినేషన్లకూ ఓకే
పరిశీలనలో ఒకరి నామినేషన్
తొమ్మిది మంది నామినేషన్ల తిరస్కరణ
అబ్జర్వర్ సమక్షంలో పరిశీలన
ఉప సంహరణకు రేపు తుది గడువు
వరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం నుంచి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను బుధవారం ఎన్నికల అధికారులు పరిశీలించారు. తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సహా నలుగురి నామినే షన్లకు ఆమోదం తెలిపారు. ఒకరి నామినేషన్ పరిశీలనలో ఉంది. ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి సహా పద్నాలుగు మంది 21 నామినేషన్ సెట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం వరంగ ల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. స్థానిక సంస్థల శాసనమండలి సాధారణ ఎన్నికల పరిశీలకురాలు శైలజ రామయ్య ర్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి కలెక్టరేట్లోని కాన్ఫరె న్స్ హాలులో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. అభ్యర్థుల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి పోచంప ల్లి శ్రీనివాస్రెడ్డి తరపున ప్రతినిధిగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిలోని చెక్ లిస్ట్ ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు మంత్రి శ్రీశైలం, బానోతు రూప్సింగ్, పోతరాజు రాజుకు చెందిన ఎనిమిది నామినేషన్ సెట్ల పత్రాలు సక్రమంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి గోపి ధృవీకరించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీరం దేవేందర్రెడ్డి ఒక నామినేషన్ సెట్ పత్రాలు పరిశీలనలో ఉన్నందున గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన ఇంకో తొమ్మిది మందికి చెందిన 12 నామినేషన్ సెట్ల పత్రాలను ఎన్నికల నియమావళి మేరకు సరిగ్గా లేనం దున తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ తొమ్మిది మందిలో బొమ్మగాని భాస్కర్, అన్నారపు యాకయ్య, గిరి కొండల్రెడ్డి, బుర్ర సంజయ్కుమార్, వేం వాసుదేవరెడ్డి, పేర్నే ఉషా, విడిదినేని అశోక్, పాల్వయి లక్ష్మీనారాయణ, పెరుమాండ్ల గుట్టయ్య ఉన్నారు. పరిశీలనలో ఉన్న బీరం దేవేందర్రెడ్డి నామినేషన్ పత్రాలకు ఎన్నికల అధికారులు ఆమోదం తెలుపుతరా, తిరస్కరిస్తారా అనేది గురువారం తేలనుంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ పాల్గొన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 26వ తేదీ వరకు ఉంది.