నర్సింహులపేట, అక్టోబర్ 23 : అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలకు విధించిన జరిమానాలు కలెక్టర్ అకౌంట్లో జమకాని విషయమై ఈ నెల 21న ‘ట్రెజరీలో జమకాని జరిమానాలు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వెలువడిన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం మండలంలోని జయపురం శివారు ఆకేరు వాగును ట్రెయినీ కలెక్టర్ అభినవ్ అగస్త్య పరిశీలించారు. వాగులో ఇసుక లభ్యతపై తొర్రూ రు ఆర్డీవో రమేశ్, భూగర్భ, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఇసుక ఎన్ని మీటర్ల లోతువరకుంది, నీటి లభ్యతపై భూగర్భ జలశాఖ అధికారి నరేశ్, మైనింగ్ శాఖ ఆర్ఐ సురేశ్ పరిశీస్తున్న సమయంలో రైతులు అడ్డుకున్నారు. రెండేళ్ల క్రితం ఇసుక తరలించేందుకు అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు. రెవి న్యూ అధికారులు ఇష్టా రాజ్యంగా ఇసుక టాక్టర్లకు ఇనుమతులిస్తున్నారని, దీంతో వాగులో వేసవిలో నీరు అడిగంటిపోవడంతో పంటలు పండించుకునే అవకాశం లే కుండాపోతున్నదని పలువురు అవేదన వ్యక్తం చేశారు.
మూడు సార్లు పట్టుబడితే సీజ్ చేయాలి..
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనం పట్టుబడితే మొదటి సారి రూ.5 వేలు, రెండో సారి రూ.15 వేలు, మూడో సారి పట్టుబడితే రూ.లక్ష జరిమానా విధించాలని నిబంధనలున్నాయి. అయితే ఎన్నిసార్లు పట్టుబడినా రెవిన్యూ అధికారులు రూ. 5 వేలు మాత్రమే జరిమానా విధించి డీడీలు అధికారుల పేరున తీస్తున్నారు. ఆదేశాలు లేకున్నా సీజ్ చేసిన వాహనాలను వదిలేయడంపై తహసీల్దార్ ఇమ్మానియేల్ స్పందించారు. తొర్రూరు ఆర్డీవో అదేశాల మేరకు డీడీలు తీస్తున్నారని ఆయన చెప్పారు. అనుమతి లేకుండా ఇసుక తరలించే వాహనాలకు జరిమానా విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐబీ ఏఈ రాజ్కుమార్, ఆర్ఐ సైదులు, వీఆర్వో వీరసోములు పాల్గొన్నారు.