జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు
అంబేద్కర్ భవన్లో న్యాయ సేవల శిబిరం
నయీంనగర్, అక్టోబర్23: ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థపై నమ్మకముంచి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని న్యాయ సేవా ధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నర్సింగ రావు అన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్, ‘పాన్ ఇండి యా అవేర్నెస్, ఔట్రీచ్ క్యాంపెయిన్ను పురస్కరించుకుని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ(నాల్సా) ఆదేశాల మేరకు శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో న్యాయ సేవల శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నర్సింగరావు హాజరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మా ట్లాడారు. చట్టాలపై అవగాహన, న్యాయ సేవలపై ప్రజలను చైతన్యపరిచే దిశగా నాల్సా విజ్ఞాన సదస్సులను నిర్వహించేలా చర్యలు చేపట్టిందన్నారు. ఆర్థిక, సామాజిక, సాంఘిక, సంస్కృ తి, ఇతర ఏ కారణాల వల్ల కూడా అన్యాయానికి, పీడనకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే న్యాయ సేవాధికార సంస్థ విజ్ఞాన సద స్సులు, న్యాయ సేవల శిబిరాలు నిర్వ హిస్తున్నదని తెలిపారు. వార్షికాదాయం రూ. మూడు లక్షలకు మించని వారికి ఉచిత న్యాయ సలహాలు అందించడం తోపాటు ఉచితంగా న్యాయవాదిని ఏర్ప రిచి న్యాయం జరిగేలా కృషి చేస్తుంద న్నా రు. యువత స్వయంఉపాధిలో శిక్షణ పొంది, నైపుణ్యాలను పెంచుకుని ఆర్థి కంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు.
స్టాల్స్ ఏర్పాటు
న్యాయ సేవల శిబిరంలో 20 స్టాల్స్ ఏర్పా టు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వివరించారు. కార్యక్రమంలో పోలీసు కమి షనర్ డాక్టర్ తరుణ్జోషి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి జీవీ మహేశ్నాథ్, బార్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ సిరికొండ సంజీవరావు, దుస్స జనార్దన్, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేపీ ఈశ్వర్నాథ్, డీసీపీ పుష్ప, న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, మహిళాగ్రూపులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.