కాటారం, అక్టోబర్22: రాజ్యాంగం కల్పించిన న్యాయసేవలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య, న్యాయవాది సుభాష్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్యాన్ ఇండియా అవేర్నెస్, ఔట్రీచ్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ ప్రకారం ప్రజలందరికీ సమాన న్యాయం, ఉచిత న్యాయసహాయం అందుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దామెరకుంట, గంగారం, అంకుసాపూర్, ప్రతాపగిరి, చిదినెపల్లి, కొత్తపల్లి, బయ్యారం, మేడిపల్లి, ధర్మాసాగర్, వీరాపూర్ జీపీల్లోనూ ఉచిత న్యాయ సేవలపై అవగాహన సభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయులు, సర్పంచ్లు తోట రాధమ్మ, తెప్పల దేవేందర్రెడ్డి, వేమునూరి రమేశ్రెడ్డి, గుంటి లక్ష్మి, సుమలత, రాజమౌళి, రఘురాం, సంధ్య, సుధాకర్, అనూష, కార్యదర్శులు సఘీర్ఖాన్, సరస్వతి, శివకుమార్, రవి, ప్రసన్న, రజిత పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మహదేవపూర్: న్యాయ వ్యవస్థలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను గ్రామస్తులు వినియోగించుకోవాలని మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవలపై గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. న్యాయసేవల కరపత్రాలను కార్యదర్శి చదివి గ్రామస్తులకు సభలో వినిపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు నిండుతున్న సందర్భంగా అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఈక్రమంలో అవగాహన కల్పించామని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బన్సోడ రాణిబాయి, ఉపసర్పంచ్ సల్మాన్ఖాన్, వార్డు సభ్యులు మేర్గు స్వప్న, వెంకటస్వామి, సలేహ, ఉస్మాన్ఖాన్, రజిత పాల్గొన్నారు.